
పిటిషనర్ వాదనను తొసిపుచ్చిన న్యాయమూర్తి
ఈ పిటిషన్ను బుధవారం విచారించిన జస్టిస్ చల్లా కోదండరామ్ నేతృత్వంలోని ధర్మాసనం 17న జరిగే ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఎన్నికలను యథాతథంగా జరుపుకోవచ్చని అన్నారు. అయితే, ఎన్నికల ఫలితాలను మాత్రం తాము ఉత్తర్వులు జారీచేసే దాకా ప్రకటించవద్దని ఆదేశించారు.

తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా
తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. హెచ్సీఏ అధ్యక్ష పదవికోసం మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, మాజీ ఎంపీ వివేక్లు నామినేషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం టెస్టు మ్యాచ్లాడిన క్రికెటర్లు ఆయా రాష్ట్ర సంఘాల ఎన్నికల్లో ఓటింగ్కు అర్హులు. అయితే హెచ్సీఏ ఎన్నికల్లో ఓటర్ల నమోదు గడువు ఆదివారంతో ముగిసింది.

ఓటు హక్కు లేని అజహరుద్దీన్
ఇందులో ఓటరుగా అజహరుద్దీన్ తన పేరు నమోదు చేసుకోలేదు. హెచ్సీఏలో ఓటు హక్కు లేనందున అజరుద్దీన్ ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు కాదని ప్రత్యర్ధి వర్గం వాదిస్తోంది. దీంతో అజహర్ నామినేషన్ వేసినా అది చెల్లుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు
మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కావడంతో, ఎవరెవరు ఎన్నికల బరిలో ఉంటారన్నది ఈరోజు తేలనుంది. సిటీ సివిల్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో అడ్హక్ కమిటీ ఛైర్మన్ ప్రకాశ్చంద్ జైన్ ఆధ్వర్యంలో జనవరి 17న హెచ్సీఏకు ఎన్నికలు జరుగుతున్నాయి. న్యాయవాది రాజీవ్రెడ్డి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











