హైదరాబాద్: సొంతగడ్డపై ముక్కోణపు టి20 టోర్నీ సిరిస్లో ఆతిథ్య జింబాబ్వేకు ఒక్క విజయం కూడా దక్కలేదు. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది.
జింబాబ్వే ఆటగాళ్లలో సాల్మన్ మిరే (63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా వారంతా తక్కువ స్కోర్లకే పరమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి గెలిచింది.
ఆసీస్ బ్యాట్స్మెన్లలో మాక్స్వెల్ (38 బంతుల్లో 56; 1 ఫోర్, 5 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (42 బంతుల్లో 48; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 71 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి.
ఈ సమయంలో తిరిపానో తొలి రెండు బంతులను వైడ్గా వేయడం జింబాబ్వేను దెబ్బతీసింది. ఆ తర్వాత 4 బంతుల్లో 3పరుగులే ఇచ్చినా ఐదో బంతిని స్టొయినిస్ ఫోర్గా మలచడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ఓడి జింబాబ్వే ఈ సిరిస్ నుంచి నిష్క్రమించింది.
Glenn Maxwell explains his half-century celebration during the #ZIMvAUS tri-series clash. pic.twitter.com/tOIoXGTLZH
— cricket.com.au (@CricketAus) July 6, 2018
ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆండ్రూ టై (3/28)కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. టోర్నీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.