టీ20 ఫార్మాట్లో తొమ్మిదో కెప్టెన్
ఇకపోతే హార్దిక్ పాండ్యా టీ20 ఫార్మాట్లో ఇండియాకు కెప్టెన్సీ వహించిన తొమ్మిదో ప్లేయర్. టీ20ల్లో వికెట్ సాధించిన తొలి మరియు ఏకైక భారత కెప్టెన్ కూడా. అంతకుముందు భారత టీ20 ఫార్మాట్లకు వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ కెప్టెన్సీ వహించారు. ఈ కెప్టెన్లలో ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. టీ20ల్లో కోహ్లీ, రైనా, రోహిత్లు తమ వికెట్లు తీసినప్పటికీ.. వారు కెప్టెన్గా కాకుండా ప్లేయర్గా వికెట్లు తీశారు.
టీమిండియా లోయర్ ఆర్డర్లో హిట్టర్గా
28ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు అద్భుతమైన కెప్టెన్సీ అందించాడు. అతను గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే ఆ జట్టుకు టైటిల్ అందించేలా కెప్టెన్సీ చేశాడు. ఈ ఆల్రౌండర్ తన బ్యాటింగ్లో మరో కోణాన్ని కూడా చూపించాడు. అతను బ్యాటింగ్లో కీలక పాత్రను పోషించాడు. తమ జట్టు ప్లేయర్లు మరింత స్వేచ్ఛతో ఆడేలా వ్యవహరించాడు. అతను ఐపీఎల్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాక.. తన బ్యాటింగ్ శైలిని మళ్లీ మార్చుకున్నాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ.. హిట్టింగ్ చేయడంలో విజయవంతం అవుతున్నాడు.
హార్దిక్ పాండ్యా 12బంతుల్లో 24తో చెలరేగడంతో..
ఇకపోతే వర్షం వల్ల నిన్నటి మ్యాచ్ను 12 ఓవర్లకు కుదించగా.. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 4వికెట్ల నష్టానికి 108పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ (1/16), యుజ్వేంద్ర చాహల్ (1/11) ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. కానీ హ్యారీ టెక్టార్ (33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 64 నాటౌట్) ఐర్లాండ్ తరఫున రాణించి.. ఆ జట్టు స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అనంతరం దీపక్ హుడా ( 29 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స్లతో 47 నాటౌట్), ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26 ) రాణించగా.. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( 12 బంతుల్లో ఫోర్, మూడు సిక్స్లతో 24) చెలరేగడంతో భారత్.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.