1996లో తొలి టెస్టు
1996లో ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో సౌరవ్ గంగూలీ ఎంపికయ్యాడు. అయితే, ఆ సిరిస్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ-అజారుద్దీన్ల గొడవ జరగడంతో... ఉన్నపళంగా సిద్దూ స్వదేశం తిరుగు పయనమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అరంగేట్రం చేసిన సౌరవ్ గంగూలీ... లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో సెంచరీ సాధించాడు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో
మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం భారత్ క్రికెట్పై పెనుప్రభావం చూపింది. ఫిక్సింగ్ ఆరోపణలతో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో దాదా ఆ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు. గంగూలీ నాయకత్వంలోనే భారత్ 2003 ప్రపంచకప్ ఫైనల్ చేరింది.
2003 ప్రపంచకప్లో
ఈ టోర్నీలో గంగూలీ కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా 3 సెంచరీలతో 465 పరుగులు చేసి కీలకపాత్ర పోషించాడు. ఇక, ఇంగ్లాండ్ నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ చొక్కా విప్పిన సంఘటన అభిమానులకు ఇప్పటికీ గుర్తే. ఫైనల్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా నెగ్గింది.
2005లో ఫామ్ కోల్పోవడంతో
సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని టీమిండియా 2001లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, 2002లో జింబాంబ్వే, వెస్టిండీస్ టెస్టు సిరీస్లను నెగ్గింది. ఆ తర్వాత గంగూలీ 2005 ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. అప్పటి వైస్ కెప్టెన్గా ఉన్న రాహుల్ ద్రవిడ్కు కెప్టెన్గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత దాదా పాక్పై 2011లో తన ఆఖరి వన్డేని ఆడాడు.
గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు
సౌరవ్ గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ ట్వీట్స్ మీకోసం...