వీళ్ల బాగోతాలు నాకు తెలియనివి కావు
సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానెల్లోని వీడియోలో మాట్లాడుతూ..'తమాషా ఏమిటంటే.. షాదాబ్ కావొచ్చు, హసన్ కావొచ్చు. వారిద్దరి మేనేజర్ ఒకరే. ఆ మేనేజర్ ఒక ఆటగాడి గురించి ఒకలా పోస్టు చేస్తాడు. నేను బాగా ఆడలేదు నన్ను క్షమించండి అంటూ ప్రాధేయపడతాడు. దాన్ని సమర్థించేలా మరో ఆటగాడి సోషల్ మీడియా ఖాతా నుంచి అదే మేనేజర్ మరో పోస్ట్ చేస్తాడు.
ఏం లేదు సోదరా నువ్వు బానే ఆడావు.. వెల్ ప్లేయిడ్ అంటూ ఆ పోస్టులో పేర్కొంటాడు. వీళ్ల బాగోతాలు నాకు తెలియనివి కావు. ఇదో పెద్ద ఇలకథ మఫిలియా బ్యాచ్. వీళ్ల సర్కస్ ట్రిక్స్ గురించి నాకు తెలిసినంత వరకు సగం మంది పాక్ క్రికటర్లకు తమ ట్విట్టర్ అకౌంట్లలో వాళ్ల మేనేజర్లు ఏం ట్వీట్ చేస్తున్నారో కూడా తెలియదు. నేను కావాలంటే పందెం కూడా కడతాను.' అంటూ సల్మాన్ భట్ పేర్కొన్నాడు.
|
బ్యాటింగ్ లైనప్ ఎంత దృఢంగా ఉందో తెలుస్తుందిలే..!
ఇక ఆసియా కప్ ఫైనల్లో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు ఎంపికపై సల్మాన్ బట్ విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ సడెన్గా కుప్పకూలడం బట్టి టీ20 ఫార్మాట్లో జట్టు బ్యాటింగ్ లైనప్ ఎంత దృఢంగా ఉందో తెలుస్తూనే ఉందని సల్మాన్ బట్ దెప్పిపొడిచాడు. ఫైనల్లో కేవలం 54పరుగులకే పాక్ చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. మెరిట్పై ఎంపిక చేయని కొందరు ఆటగాళ్లు జట్టులో పాతుకపోయారంటూ భట్ సీరియస్ అయ్యాడు.
పాక్ జట్టుకు తగిన శాస్తే జరిగింది
'ఆసియా కప్ ఫైనల్లో జట్టు ఓటమికి కారణం చాలా మంది ప్రెషర్, తొక్కతోలు అంటున్నారు. కాదు పాక్ జట్టుకు దక్కాల్సిన ఫలితమే దక్కిందని నేనంటాను. గత మూడేళ్లుగా జట్టులో పాతుకుపోయిన చర్యలకు ఇది నిజమైన ఫలితం. కాస్త ప్రెషర్ వస్తే బ్యాటింగ్ కుప్పకూలిపోతుందన్న మాట. కాస్త మెరుగైన బౌలింగ్ అటాక్లను ఆడలేక చేతులెత్తేస్తారన్న మాట, ఏదైనా అంటే ప్రెషర్ గేమ్ అంటూ సమర్థించుకోవాలన్నమాట, ఈ చర్యలన్నీ నాకు తెలియనివి కావు.
ఏదేమైనా ముమ్మాటికి పాక్ జట్టు బేషరతుగా తమను తాము నిందించుకోవాల్సిన రిజల్ట్ ఇది. గత మూడు సంవత్సరాల నుండి కనీసం రెండు హాఫ్ సెంచరీలు కూడా చేయలేని ఆటగాళ్లు ఇప్పటికీ జట్టులో తాపీగా తమ స్థానాల్లో ఆడుతూనే ఉన్నారు. వాళ్ల మీద చర్యలేవీ? అడిగేవారేరీ? అంటూ భట్ ఓ రేంజులో ఫైర్ అయ్యాడు.
ఎన్నడు ఇన్ టైంలో ప్రకటించారని..?
కట్ ఆఫ్ డేట్ దగ్గరపడుతున్నా T20 ప్రపంచకప్ జట్టును పాకిస్థాన్ ఇంకా ప్రకటించకపోవడం పట్ల సల్మాన్ భట్ సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. 'పాకిస్తాన్ జట్టు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో మార్పులకు సిద్ధంగా ఉంది. ఎన్నడన్న సకాలంలో జట్టును ప్రకటించిన బోర్డేనా ఇది. ఇప్పుడు మాత్రం కొత్తగా ఏం జరుగుతుందని... చివర్లో హడావుడిగా ప్రకటించడం, ప్రకటించాక మళ్లీ చివరి క్షణాల్లో మార్పులు జరగడం ఎవరికీ తెలియవు.
ఒకవేళ జట్టును ప్రకటించినప్పటికీ.. సెలెక్ట్ అయిన ఆటగాళ్లు నిబ్బరంగా ఉంటారా అంటే అది లేదు. తమ స్థానాలు ఎక్కడ ఉంటాయో ఉడుతాయో అనే డైలామా ఉండనే ఉంటది. చివరి క్షణంలో వాడు అందుబాటులోకి వచ్చాడని వీడిని తీసేరకం బోర్డు.' అంటూ సల్మాన్ భట్ తన అసహనాన్ని అంత చూపించాడు.