|
4,4,4,6, ఔట్
అడిలైడ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో నాలుగో రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్లో 16 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్.. 4ఫోర్లు, 1సిక్సు సాయంతో 28 పరుగులు చేశాడు. ఆసీస్ గడ్డపై తొలి సారి మ్యాచ్ ఆడేందుకు ఉపక్రమించిన పంత్.. మూడో వంతు పరుగులు ఒకే ఓవర్లో రాబట్టేశాడు. పుజారా (71), విరాట్ కోహ్లి (34), రహానె (70), రోహిత్ శర్మ (1) వికెట్లను పడగొట్టి మంచి ఊపుమీద కనిపించిన స్పిన్నన్ నాథన్ లైన్.. 95వ ఓవర్లో మిడ్వికెట్లో ఫీల్డర్ని ఉంచి రిషబ్ పంత్ను ఊరిస్తూ బంతులు విసిరాడు.
ఆస్ట్రేలియాకి 323 పరుగుల భారీ లక్ష్యాన్ని
కానీ.. క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్లు ఆడిన రిషబ్ పంత్.. ఆ ఓవర్లోని చివరి నాలుగు బంతుల్నీ వరుసగా 4, 4, 4, 6 బాదేశాడు. కానీ.. ఆ తర్వాత 97వ ఓవర్లో పంత్ కూడా లయన్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకి 323 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఆసీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 307 పరుగులకు ఆలౌటైంది.
నాలుగోరోజు జోడించింది 156 పరుగులే
151/3 ఓవర్నైట్ స్కోర్తో మ్యాచ్ ప్రారంభించిన భారత్ నాలుగోరోజు 156 పరుగులు జోడించింది. పుజారా(71; 204బంతుల్లో), అజింక్య రహానె(70; 147బంతుల్లో) రాణించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో టీమిండియా 323 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది. భోజన విరామ అనంతరం రహానె మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. షమీ, ఇషాంత్ డకౌట్ కాగా బుమ్రా నాటౌట్గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో లైన్ 6 వికెట్లు తీయగా.. స్టార్క్ 3, హేజిల్ వుడ్ ఒక వికెట్ తీశారు.