ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే
ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆ జట్టు సరిగ్గా ఆడటం లేదని... దీంతో ఆయనకు ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయని పోలీసులు తెలిపారు. గత నెలలో బ్యాంక్ నుంచి ఆయన నోటీసులు సైతం అందుకున్నారని తెలిపారు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగిన అనంతరం ఆయన తన బెడ్రూమ్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్నారు.
భార్య ఫిర్యాదు మేరకు
ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా, శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఆయన వయసు 58 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. తమిళనాడుకు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్మన్ భారత్ తరఫున 1988-90 మధ్య కాలంలో ఏడు వన్డేలు ఆడి మొత్తం 88 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మతో కలిసి బుమ్రా, కోహ్లీని ఇమిటేట్ చేసిన జడేజా(వీడియో)
56 బంతుల్లో సెంచరీ
దీంతో చోటు కోల్పోయి మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. ఓపెనర్గా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన వీబీ చంద్రశేఖర్ 81 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు. చంద్రశేఖర్ 1988-89 రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఇరానీకప్ మ్యాచ్లో చంద్రశేఖర్ 56 బంతుల్లో సెంచరీ సాధించడం విశేషం. అప్పట్లో భారత్ తరఫున అదే ఫాస్టెస్ట్ ఫస్ట్ క్లాస్ సెంచరీ.
2012లో తమిళనాడు కోచ్గా
రిటైర్మెంట్ అనంతరం 2012లో తమిళనాడు కోచ్గా, గ్రెగ్ ఛాపెల్ భారత జట్టు కోచ్గా ఉన్న సమయంలో సెలక్టర్గా సేవలు అందించాడు. చంద్రశేఖర్ మృతిపట్ల బీసీసీఐ సంతాపం తెలిపింది. మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్లతో పాటు హర్భజన్ సింగ్, సురేశ్ రైనాలు సైతం సానుభూతి తెలిపారు.