
13 ఓవర్ల పాటు ఆట సజావుగా
అయితే, ఇందులో కూడా 13 ఓవర్ల పాటు ఆట సజావుగా సాగింది. అయితే, వర్షం మ్యాచ్కు ఆటంకం కలిగించిన సమయంలో జట్టు సభ్యులంతా సరదాగా ఆట పాటలతో కాలక్షేపం చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ-రవీంద్ర జడేజా సరదా గేమ్ ఆడారు. రోహిత్ ఓ బోర్డు పట్టుకుని పేరు చూపిస్తే దానిని యాక్టింగ్ ద్వారా జడేజా చేసి చూపించాలి.
20 ఏళ్ల తర్వాత కూడా కోహ్లీ-రోహిత్ విబేధాలపై స్టోరీలు ఆగవు

తొలుత బుమ్రా పేరు రావడంతో
ఇందులో భాగంగా తొలుత బుమ్రా పేరు రావడంతో జడేజా... బుమ్రా బౌలింగ్ యాక్షన్ను చేసి చూపించాడు. రోహిత్ శర్మ ఠక్కున బుమ్రా పేరు చెప్పడంతో రెండో బోర్డులో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు వచ్చింది. ఇండియన్ బ్యాట్స్మన్ అని చెప్పి కోహ్లీ మణికట్టు దగ్గర బ్యాట్ సర్దుకునే స్టైల్ చూపించడంతో వెంటనే రోహిత్.. కోహ్లీ అంటూ గట్టిగా అరిచాడు.
కోహ్లీ సైతం వీరిద్దరి సరదా ఆటను చూసి
జడేజా యాక్టింగ్కు రోహిత్ శర్మ వెంటనే చెప్పేయడంతో ఇద్దరూ ఆనందంలో ఎగిరి గంతులేశారు. మరోవైపు ఆ పక్కనే ఉన్న కోహ్లీ సైతం వీరిద్దరి సరదా ఆటను చూసి తాను కూడా నవ్వుకున్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. జడేజా నుంచి రోహిత్ శర్మ హెడ్స్ అప్ ఛాలెంజ్ తీసుకున్నాడు అంటూ పోస్టు చేసింది.
India vs West Indies: లారా రికార్డు బద్దలు, చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్

ఆదివారం రెండో వన్డే
ఇదిలా ఉంటే, మూడు వన్డేల సిరిస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డే ఆగష్టు 11(ఆదివారం)నాడు జరగనుంది. దీంతో ఈ సిరిస్లో మిగతా రెండు వన్డేలు కీలంక కానున్నాయి. వన్డే సిరిస్ అనంతరం టీమిండియా 2 టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.


Click it and Unblock the Notifications












