వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా
2014, నవంబర్ 13న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లభించిన లైఫ్ను సద్వినియోగం చేసుకున్న రోహిత్ శర్మ(264) ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
33 ఫోర్లు, 9 సిక్సులు సాయంతో 264
రోహిత్ శర్న ఇన్నింగ్స్లో మొత్తం మొత్తం 33 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. మ్యాచ్ మొదట్లో నిలకడగా ఆడిన రోహిత్ శర్మ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడాడు. 100 బంతుల్లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఆ తర్వాత 173 బంతుల్లో 264 పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం.
|
చివరి 73 బంతుల్లో రోహిత్ శర్మ 164 పరుగులు
చివరి 73 బంతుల్లో రోహిత్ శర్మ 164 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో అంతకముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్(219) రికార్డుని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఈ రికార్డుని 2011లో ఇండోర్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.
ఐదు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసిన భారత్
రోహిత్ బాదుడుకి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 404పరుగులు చేసింది. ఆ తర్వాత చేధనకు దిగిన శ్రీలంక 153 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయింది. 2014లో ఇదే రోజున రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన సందర్భంగా ఐసీసీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా క్రికెట్ అభిమానులతో పంచుకుంది.
మొహాలీ వేదికగా మరోసారి డబుల్
ఆ తర్వాత డిసెంబర్ 13, 2017న శ్రీలంకపై మళ్లీ మోహాలి వేదికగా జరిగిన మ్యాచ్లో మరోసారి డబుల్ సెంచరీ (208) చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి నాలుగు డబుల్ సెంచరీలు చేసింది భారత క్రికెటర్లే కావడం విశేషం. తొలుత సచిన్ టెండూల్కర్ (200 నాటౌట్) దక్షిణాఫ్రికా జట్టుపై తొలి డబుల్ సెంచరీ చేయగా, ఆ తర్వాత 2011లో వెస్టిండిస్పై సెహ్వాగ్(218) డబుల్ సెంచరీ సాధించాడు.