ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున
కాగా, ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 8 మ్యాచ్లాడి 130 పరుగులు చేశాడు. ఈ ఏడాది మే నెలలో మిర్పుర్లోని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు చెందిన అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్గా భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ను నియమించిన సంగతి తెలిసిందే. వసీం జాఫర్ దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు.
రంజీ క్రికెట్లో 19 సీజన్లు ముంబైకి ప్రాతినిథ్యం
రంజీ క్రికెట్లో 19 సీజన్లు ముంబైకి ప్రాతినిథ్యం వహించిన జాఫర్ చివరగా విదర్భ జట్టు తరుపున ఆడాడు. ఒక రంజీ సీజన్లో రెండు సార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్మన్గా అరుదైన ఘనత సాధించాడు. జాఫర్ 40 ఏళ్లు పైబడిన తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్గా, అదే విధంగా తొలి ఆసియా బ్యాట్స్మన్గా నిలిచాడు.
1996-97లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం
1996-97లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వసీం జాఫర్ ఇప్పటివరకు మొత్తం 251 ఫస్ట్క్లాస్ మ్యాచుల్లో యావరేజి 51.42తో 19 వేల పరుగులు చేశాడు. ఇందులో 57 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాఫర్ అత్యధిక స్కోరు 314 పరుగులు. భారత జట్టు తరఫున 2000లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేశాడు.
2008లో అదే జట్టుతో
2008లో అదే జట్టుతో తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు.1996-2015 మధ్య కాలంలో ముంబై జట్టు తరఫున రంజీల్లో ఆడాడు. మొత్తం 31 టెస్టు మ్యాచ్లాడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి.