|
రోహిత్ను ట్రోల్ చేసిన డీకే:
రోహిత్ శర్మ వేసిన ఆ బంతిని ఎదుర్కొన్న మార్నస్ లబుషేన్ (108) కట్ షాట్ ఆడి సింగిల్ తీశాడు. అయితే రోహిత్ బౌలింగ్ చేయడాన్ని వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ సరదాగా ట్వీట్ చేశాడు. భారత ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.. రోహిత్ బౌలింగ్ను చూసి నేర్చుకోవాలన్నాడు. జట్టులో కొత్త ఫాస్ట్ బౌలర్ వచ్చాడని ట్వీట్ చేశాడు. అంతేకాదు ముగ్గుర్నీ ట్యాగ్ చేసి ఓ జిఫ్ ఫైల్ను పోస్టు చేశాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ కార్తిక్ ఆ పోస్టును తొలగించాడు. అయితే అప్పటికే ఆ ట్వీట్ వైరల్గా మారింది.
గాయంపై ఇంకా స్పష్టత లేదు:
మ్యాచ్ అనంతరం నవదీప్ సైనీకి టీమిండియా మేనేజ్మెంట్ స్కానింగ్ చేసింది. అయితే ఇవాళ రెండవ రోజు కూడా సైనీ.. బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి రాలేదు. అతనికి అయిన గాయం తీవ్రంగా ఉండడంతోనే సైనీ బౌలింగ్ చేయలేదని తెలుస్తోంది. సైనీ ఫిట్గా లేకపోవడం భారత క్రికెట్కు ఇదో చేదువార్తే. మరోవైపు సైనీ గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. అతడిని వైద్య పరీక్షలకు తరలించినట్లు బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేసింది.
కార్తీక్పై వేటు తప్పదా?:
గత రెండు ఐపీఎల్ సీజన్లలో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు సారథిగా చేసిన దినేశ్ కార్తిక్ పూర్తిగా విఫలమయ్యాడు. 2020లో మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్నాడు. ఐపీఎల్ 2021కి ముందు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ (7.4కోట్లు)ను వదులుకోవాలని కేకేఆర్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు తెలిసింది. జట్టులో ప్రతిభావంతులైన వికెట్ కీపర్లు టామ్ బాంటన్, నిఖిల్ నాయక్లు ఉన్నారు. అందుకే కార్తీక్ను వదులుకోవాలని చూస్తోంది.