|
ట్విట్టర్లో ఓ వీడియో
సోమవారం ఆ వార్తలకు చెక్ పెడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విట్టర్లో ఓ వీడియోని పోస్టు చేస్తూ " మా కెప్టెన్ ఫెంటాస్టిక్, వచ్చే సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఉన్నాడు. అనుభవజ్ఞులైన సూపర్ స్టార్లను జట్టులో చేర్చడంతో పాటు త్వరలో వేలం జరగబోతుంది కాబట్టి... మన కెప్టెన్ అద్భుతమైన జట్టును అన్ని విధాలా నడిపించగలడా?" అంటూ శ్రేయస్ అయ్యర్ ఉన్న పోస్టు చేసింది.
సంతోషం వ్యక్తం చేసి శ్రేయాస్ అయ్యర్
ఆ వీడియోలో అశ్విన్, రహానే లాంటి సీనియర్ ఆటగాళ్లు జట్టుతో చేరడాన్ని సంతోషం వ్యక్తం చేసి శ్రేయాస్ అయ్యర్, వేలం కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని... వచ్చే సీజన్లో తన కెప్టెన్సీలో ఢిల్లీ టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టైటిల్ ముంగిట బోల్తా పడింది.
ట్రెంట్ బౌల్ట్ను ముంబైకి
కాగా, గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ను ఆ జట్టు యాజమాన్యం ముంబై ఇండియన్స్కు బదిలీ చేసింది. ఐపీఎల్ 2018 వేలంలో ట్రెంట్ బౌల్ట్ను రూ. 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అయితే, ట్రేడింగ్లో ముంబై ఇండియన్స్ జట్టు బౌల్ట్ కోసం రూ. 3.2 కోట్లు చెల్లించడం విశేషం.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
శ్రేయస్ అయ్యర్, పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, సందీప్ లమిచానె, రబాడ, కీమో పాల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రవిచ్రందన్ అశ్విన్ (బదిలీ), అజింక్య రహానె (బదిలీ)
వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు
క్రిస్ మోరిస్, కొలిన్ ఇంగ్రామ్, బి అయ్యప్ప, హనుమ విహారి, జలజ్ సక్సేన, మన్జ్యోత్ కల్రా, నాథుసింగ్, అంకుష్ బేయాన్స్, కొలిన్ మన్రో
మిగిలిన నగదు
ఐపీఎల్ 2019 వేలానికి ముందు ఢిల్లీ పర్సులో మిగిలి ఉన్న నగదు రూ. 5.3 కోట్లు. తొమ్మిది మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఢిల్లీ అత్యధికంగా రూ .19 కోట్లు మిగిలాయి. మరోవైపుబిసిసిఐ వైపు నుండి అదనంగా 3 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో ఐపీఎల్ 2020 వేలంలో రూ. 27.85 కోట్లు ఖర్చు చేయవచ్చు.