న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్​రైజర్స్​ కెప్టెన్సీని తిరిగి పొందాననుకోవట్లేదు.. గౌరవంగా భావిస్తున్నా: వార్నర్

David Warner says Dont see Sunrisers Hyderabad captaincy as redemption tale

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టుకు మళ్లీ సారథిగా ఎంపికవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, కెప్టెన్సీని తిరిగి పొందాననుకోవట్లేదు అని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్​ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఈ సీజన్​లో జట్టుకు మరో టైటిల్​ను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నాడు. వార్నర్ నేతృత్వంలోని సన్​రైజర్స్ 2016 ఐపీఎల్ టైటిల్​ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2018లో బాల్​ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురయ్యాక.. వార్నర్​ సన్​రైజర్స్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. దీంతో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ జట్టును నడిపించాడు.

గతేడాది మళ్లీ డేవిడ్ వార్నర్ ఐపీఎల్​లో పునరాగమనం చేసి 697 పరుగులతో అదరగొట్టాడు. అయితే ఈ ఏడాది సీజన్ కోసం సన్​రైజర్స్ హైదరాబాద్​ యాజమాన్యం వార్నర్​ను మరోసారి కెప్టెన్​గా నియమించింది. ఈ విషయంపై మంగళవారం మీడియాకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ స్పందించాడు. 'సన్ రైజర్స్​కు కెప్టెన్​గా ఉండడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నా. మళ్లీ సారథ్యం దక్కడం గొప్ప విషయం అంతేకాని కెప్టెన్సీని తిరిగి పొందాననుకోవట్లేదు. నేను ఆటగాళ్లు, సిబ్బంది మరియు యజమానులతో గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నా. దానికి నేను నా కృతజ్ఞతను తెలియజేస్తున్నా' అని వార్నర్ తెలిపాడు.

'జట్టులోని ప్రతి ఒక్కరూ నాయకుడే. విలియమ్సన్​, నేను ఎప్పుడూ ఆలోచనలు పంచుకుంటాం. నేను ఏ స్థానంలో ఉన్నా ఏ తేడా ఉండదు. నేను గతేడాది కూడా నాయకుడిననే అనుకున్నా. పేరు ముందు సి(కెప్టెన్​) అని ఉందా లేదా అనేది నేను పట్టించుకోను. నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తా. మరొక ఐపీఎల్ టైటిల్ గెలిచేందుకు ప్రయత్నిస్తా. నేను జట్టులో లేనప్పుడు కేన్, భువీ అద్భుతంగా పనిచేశారు. సన్​రైజర్స్ రూపంలో ఓ గొప్ప కుటుంబం దక్కింది' అని డేవిడ్ వార్నర్ చెప్పాడు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్​ను సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్‌ 2020 ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించడానికి ఐపీఎల్‌ పాలకమండలి ఆగస్టు 2న సమావేశం జరగనుందని లీగ్ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ మీడియాకు వెల్లడించారు. మ్యాచ్‌లను కుదించాలంటే ఏమేరకు చేయాలి.. రోజుకు రెండు చొప్పున మ్యాచ్‌లు ఎన్ని పెట్టాలి.. దాదాపు రెండు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండటం ఇబ్బందన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు భార్యాపిల్లల్ని అనుమతించాలా వద్దా అనే విషయాల్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆగస్టు 2న పూర్తి స్పష్టత రానుంది.

ఉమర్‌ అక్మల్‌కు భారీ ఊరట.. సస్పెన్షన్‌ సగానికి కుదింపు!!ఉమర్‌ అక్మల్‌కు భారీ ఊరట.. సస్పెన్షన్‌ సగానికి కుదింపు!!

Story first published: Wednesday, July 29, 2020, 20:52 [IST]
Other articles published on Jul 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X