2016లో కరుణ్ నాయర్ సెంచరీ తర్వాత
మొత్తంగా చూస్తే, డిసెంబర్ 2016న ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో కరుణ్ నాయర్(303 నాటౌట్) సెంచరీ తర్వాత డేవిడ్ వార్నర్ది టెస్టుల్లో మొదటిది కావడం విశేషం. అంతేకాదు ఫిబ్రవరి 2014లో కుమార సంగక్కర(319) బంగ్లాదేశ్తో సాధించిన ట్రిపుల్ సెంచరీ తర్వాత ఓ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ చేసిన మొదటి ట్రిపుల్ సెంచరీ ఇది.
అనేక రికార్డులు బద్దలు
ఈ ట్రిపుల్ సెంచరీతో డేవిడ్ వార్నర్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వార్నర్ ట్రిపుల్ సెంచరీతో అడిలైడ్ ఓవర్ స్టేడియంలో ఇప్పటివరకు మాజీ లెజెండరీ బ్యాట్స్మన్ డాన్ బ్రాడ్మన్(299) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు కనుమరుగైంది. అంతేకాదు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా చేసిన నాలుగో ట్రిపుల్ సెంచరీ ఇది.
అగ్రస్థానంలో వీరేంద్ర సెహ్వాగ్
ఈ జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(278 balls vs South Africa, 2007-08) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మ్యాథ్యూ హెడెన్(362 balls vs Zimbabwe, 2003-04) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మళ్లీ సెహ్వాగే(364 balls vs Pakistan, 2003-04) మూడో స్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్లు
Virender Sehwag - 278 balls vs South Africa. 2007-08
Matthew Hayden - 362 balls vs Zimbabwe, 2003-04
Virender Sehwag - 364 balls vs Pakistan, 2003-04
73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో రెండో రోజైన శనివారం స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. పాక్ బౌలర్ మహ్మద్ ముసా బౌలింగ్లో సింగిల్ తీయడం ద్వారా స్మిత్ ఈ ఘనత సాధించాడు. అయితే, టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రికార్డుని ఆటగాడిగా స్టీవ్ స్మిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 73 ఏళ్ల రికార్డును స్టీవ్ స్మిత్ బద్దలు కొట్టాడు. 1946లో ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్మన్ వాలీ హమ్మాండ్ 131 ఇన్నింగ్స్ల్లో ఏడు వేల పరుగుల్ని సాధించాడు.