విస్టిండీస్ క్రికెట్ చరిత్రలో ఓ వెలుగు వెలుగిన దేశం.. రెండు సార్లు వన్డే ప్రపంచ కప్ తో పాటు రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జట్టు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎందుర్కొంటున్నారు. ఆర్థిక సంక్షోభవంతో కొట్టుముట్టాడుతుంది. రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన (2012, 2016) ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 12కి కూడా అర్హత సాధించలేకపోయింది. దీనిపై
డబుల్ T20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డారెన్ సామీ నిరాశ వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు ఆర్థిక భద్రత కలిగిస్తేనే.. జట్టు గాడిన పడుతుందని అన్నాడు.
BCCI వలె వెస్టిండీస్ బోర్డు తన ఆటగాళ్లను ఇతర లీగ్ ల్లో ఆడకుండా అడ్డుకోలేదన్నాడు. "భారతదేశం బలంగా ఉంది. బీసీసీఐ తమ ఆటగాళ్లను మరెక్కడా ఆడవద్దని ఆదేశించవచ్చు. దానిని బ్యాకప్ చేయడానికి వారి వద్ద డబ్బు ఉందని మీరు అర్థం చేసుకోవాలి" అని వెస్టిండీస్ క్రికెట్కు సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సామీ పిటిఐకి చెప్పారు. "విండీస్ A లిస్టర్తో పోల్చితే, భారతదేశం A జాబితాలో కాంట్రాక్ట్ పొందిన ఆటగాడు సంవత్సరానికి ఒక మిలియన్ డాలర్లు (రూ. 7 కోట్లు ప్లస్ మ్యాచ్ ఫీజుతో పాటు టీవీ హక్కుల డబ్బు) సంపాదించవచ్చు" అని సామీ చెప్పాడు.
"ఇది చాలా పెద్ద వ్యత్యాసం. చిన్న బోర్డులు (ఆర్థిక శక్తి పరంగా బలహీనంగా ఉన్నప్పుడు) తమ ఆటగాళ్లను వేరే చోట ఆడకుండా చేయడం చాలా కష్టం" అని సామీ వివరించాడు. స్పోర్ట్స్మ్యాన్ పీక్ పీరియడ్ చాలా తక్కువన్నాడు. "ప్రేమ కోసం ఆడే రోజులు పోయాయి. ఆ ప్రేమతో సూపర్ మార్కెట్ లో కిరాణా సామాను కొనలేరని" సామీ స్పష్టం చేశాడు.