బ్యాట్స్మన్ను బయపెట్టగలరు:
అనంతరం భారత ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ మీడియాతో మాట్లాడాడు. 'మాకు ఇద్దరు మంచి ఫీల్డర్లు ఉన్నారు. కోహ్లీ, జడేజాలు 30 యార్డ్ సర్కిల్లో ఫీల్డింగ్ చురుకుగా చేస్తారు. ఇద్దరు తమ ఫీల్డింగ్ మెరుపులతో ఎటువంటి బ్యాట్స్మన్ను అయినా బయపెట్టగలరు. ఇద్దరు ఫీల్డింగ్లో ఉంటే బ్యాట్స్మన్ పరుగు తీయడానికి ఆలోచిస్తారు' అని శ్రీధర్ తెలిపారు. ఆస్ట్రేలియా మ్యాచ్లో జడేజా అద్భుత క్యాచ్ పట్టిన విషయం తెలిసిందే. ఈ క్యాచ్ మ్యాచ్పై ప్రభావం చూపింది.
|
చాలా మెరుగయ్యాడు:
'పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫీల్డింగ్లో చాలా మెరుగయ్యాడు. 2016తో పోల్చితే అతను బాగా ఫీల్డింగ్ చేస్తున్నాడు. బుమ్రా ఫీల్డింగ్ మెరుగులు ఇంకా నేర్చుకుంటున్నాడు. చహల్, జాదవ్ కూడా బాగా కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు' అని శ్రీధర్ పేర్కొన్నారు.
ఫీల్డింగ్, క్యాచ్లపై ప్రభావం:
ధావన్ గాయంపై మాట్లాడుతూ.. 'ధావన్కు అయిన గాయంతో అతని బ్యాటింగ్కు ఇబ్బంది లేదు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పటికి అతను సహజసిద్దంగా కుడిచేతి వాటం బ్యాట్స్మన్. అయితే గాయం అతని ఫీల్డింగ్, క్యాచ్లు పట్టుకోవడంపై ప్రభావం చూపుతోంది' అని చెప్పారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ధావన్ ఎడమ బొటన వేలికి గాయమైంది. గాయం అయినా నొప్పిని భరిస్తూ.. సెంచరీ చేసాడు.