ఇవండీ రూల్స్..
1. ఆరు వికెట్లే: ఒక్కో జట్టుకు పది వికెట్లకు బదులు కేవలం 6వికెట్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ 10ఓవర్లలో 6వికెట్లు పడితే ఆ జట్టు ఆలౌట్ అయినట్లే. అయితే ఫీల్డింగ్ చేసేటప్పుడు మాత్రం బౌలర్తో సహా 11మంది ఫీల్డర్లు ఉంటారు.
2. అదనంగా పవర్ ప్లే కావాలంటే: మొదటి రెండు ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. ఇక తొలి రెండు పవర్ప్లేలో బ్యాటింగ్ చేసే జట్టు కనీసం రెండు సిక్సర్లు కొట్టగలిగితే ఫ్లోటింగ్ థర్డ్ పవర్ప్లే అన్లాక్ చేయబడుతుంది. అంటే మూడో ఓవర్ కూడా పవర్ ప్లే కొనసాగుతుంది.
3. ఒకే ఎండ్ నుంచి 5ఓవర్లు : ఇక బౌలింగ్ జట్టు ప్రతి ఓవర్ తర్వాత ఎండ్లు మార్చుకోవడంలో కూడా సడలింపులున్నాయి. ఒకే ఎండ్ నుండి వరుసగా ఐదు ఓవర్ల పాటు బౌలింగ్ చేసేందుకు వీలు కల్పించారు.
4. 45నిమిషాలు దాటితే : ఇక 45 నిమిషాల నిర్ణీత సమయంలో పది ఓవర్లు పూర్తి చేయడంలో బౌలింగ్ జట్టు విఫలమైతే ఇన్నింగ్స్లోని చివరి ఆరు బంతులకు గ్రౌండ్లో ఒక ఫీల్డర్ను తొలగించాల్సి ఉంటుంది. అంటే 9మంది ఫీల్డర్లే ఉంటారన్న మాట.
5. 'మిస్టరీ-ఫ్రీ హిట్' అనే కొత్త ఆప్షన్ను తీసుకొచ్చారు. అభిమానుల ఓటు ద్వారా ఏ ఓవర్ ఏ బంతికి ఫ్రీ హిట్ కావాలనుకుంటున్నారో ఆ బంతికి అంపైర్ ఫ్రీ హిట్ ఇస్తాడు. నోబాల్తో సంబంధం లేదు.
ఇదొక కొత్త ప్రయోగం..
ఇకపోతే ఇదేమైన క్రికెట్ అనుకుంటున్నారా.. గల్లీల్లో కర్రబిళ్ల ఆడుకునే పోరగాళ్ల ఆట అనుకుంటున్నారా అనే డౌట్ కొందరిలో కలగొచ్చు. దీనికి CPL సీఈవో పీట్ రస్సెల్ ESPNcricinfoతో భలే ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. 'ఇది క్రికెట్ కాదని కొందరు విమర్శలు చేయబోతున్నారని మాకు ముందే అర్థమవుతుంది. కానీ నా అభిప్రాయం ఏమిటంటే.. క్రికెట్ అంటేనే మజా. క్రికెట్లో భాగంగా కేవలం ఉత్సాహం, మరియు ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం గోల్ఫ్ ఆటలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక మేం క్రికెట్లో ఈ పని చేస్తున్నాం. తద్వారా కొత్తగా ప్రేక్షకులు కూడా వస్తారు. అలాగే ఇప్పటికే క్రికెట్ చూస్తున్న ప్రేక్షకులు మరింత ఎక్సైట్ అవుతారు. మేము ఇప్పుడున్న యూత్కు కావాల్సిన రీతిలో ఆటను రూపొందిస్తున్నాం.' అని పేర్కొన్నాడు.
క్రిస్ గేల్ బ్రాండ్ అంబాసిడర్గా
క్రిస్ గేల్ ఈ టీ10 లీగ్ అయిన 6ixtyకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడు. ఇక ఈ టోర్నమెంట్లో అంతర్జాతీయ ఆటగాళ్లను కూడా ఆడించనున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్లో మాత్రమే ఈ టోర్నీని నిర్వహిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో వివిధ దేశాల్లో ఈ టోర్నీని నిర్వహించాలని యోచిస్తున్నట్లు సీపీఎల్ సీఈవో పీట్ రస్సెల్ అభిప్రాయపడ్డాడు. అలాగే సంవత్సరానికి నాలుగు సార్లు ఈ టోర్నీని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈసారి ప్రారంభిస్తున్నామని.. మున్ముందు తప్పకుండా వివిధ దేశాల్లో నిర్వహించి తీరుతామని స్పష్టం చేశాడు.