
ఆటగాళ్లకు జాగ్రత్తలు:
కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భారత్తో సిరీస్ సమయంలో తమ ఆటగాళ్లెవరూ కరచాలనాలు కూడా చేయరని ప్రొటీస్ కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్యం తమ ఆటగాళ్లకు కొన్ని జాగ్రత్తలు సూచించినట్లు కూడా సమాచారం తెలుస్తోంది. జట్టు సభ్యులు ఆరోగ్య నియమాలు పాటించాలని, అంతేకాక అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు, సంభాషణలు చేయకూడదని యాజమాన్యం తెలిపినట్లు సమాచారం.

అభిమానులతో 'నో' సెల్ఫీలు:
'విదేశాలకు వెళ్లేటప్పుడు ఆటగాళ్లకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించాం. అలానే భారత్కు వెళ్లేప్పుడు కూడా చెప్పాం. ఇవి ఆటగాళ్లకే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని ఇప్పటికే ఆటగాళ్లకు సూచించాం' అని దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్య వర్గాలు తెలిపాయి. ఈ సూచనలు వన్డే సిరీస్తో పాటు ఈ నెల 29 నుండి ఆరంభం కానున్న ఐపీఎల్లోనూ పాటించాలని తెలిపినట్లు సమాచారం.

ధర్మశాలలో తొలి వన్డే:
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోగా.. భారత క్రికెటర్లు మాత్రం మంగళవారం అక్కడికి వెళతారు. అంతకుముందు బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్, వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత్ ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లఖ్నవూ వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో మార్చి 18న ఆఖరి వన్డే ఆడనుంది.


Click it and Unblock the Notifications












