జనసమూహాలు వద్దు.. దేశ ఆరోగ్యం ముఖ్యం..
ఈ నేపథ్యంలోనే కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజీజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అతని మాటలను బట్టి చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2020) ప్రేక్షకుల్లేకుండా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
‘కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా జనసమూహాలను తగ్గించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు సూచిస్తున్నారు. అందుకే క్రౌడ్ ఎక్కువగా ఉండే స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ పాటించాలని క్రీడా ఫెడరేషన్స్ను కోరుతున్నాం. తాము ఈవెంట్స్ ఆపాలనుకోవడం లేదు. కానీ, జనసమూహాలు ఉండకుండా నిర్వహించుకోవాలని సూచిస్తున్నాం.'అని కిరణ్ రిజీజు తెలిపారు.
ఇక ఐపీఎల్ గురించి ప్రశ్నించగా.. ‘మేం క్రీడలను అడ్డుకోవాలనుకోవడం లేదు. జనసమూహాలు లేకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నాం. అన్నిటికన్నా దేశ ఆరోగ్యం ముఖ్యం.'అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్లు ప్రేక్షకుల్లేకుండా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వరల్డ్ సిరీస్..
మరోవైపు పూణెలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్పై ఆంక్షలు విధించారు. ఈ టోర్నీ 14 నుంచి 20 మధ్య నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్లను ప్రేక్షకుల్లేకుండా నిర్వహించనున్నారు. అలాగే ఇతర వేదికల్లో జరిగే మ్యాచ్లు కూడా అవే తేదీల్లో ఈ తరహాలోనే జరుగుతాయి.
14న తుది నిర్ణయం
కరోనా ప్రభావంతో ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. రాష్ట్రల అభ్యంతరం, కరోనా, కేంద్ర ప్రభుత్వం వీసాల జారీ నిరాకరణ అంశాలే ప్రధాన ఎజెండగా ఈ భేటీ జరగనుంది. 'ప్రస్తుతం మేం కరోనా వైరస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. శనివారం ఐపీఎల్ పాలక మండలి సభ్యుల సమావేశం జరగనుంది. ఐపీఎల్ 2020పై తుది నిర్ణయం తీసుకుని సమాచారం అందిస్తాం' అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఈ నెల 29న ముంబైలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ మొదలు కానున్న విషయం తెలిసిందే.