|
అసలేం జరిగింది?
కోల్కతా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో పంత్.. బంతి పడే ముందే దాని ఫలితాన్ని అంచనా వేశాడు. యే తో వైసీ భీ చౌకా హై (ఇదెలాగూ ఫోర్ వెళ్తుంది) అని పంత్ అనడం స్టంప్ మైక్లో స్పష్టంగా రికార్డు అయింది. పంత్ అన్నట్లే... ఆ జట్టు స్పిన్నర్ సందీప్ లామిచానె వేసిన ఆ తర్వాతి బంతిని కోల్కతా బ్యాట్స్మన్ రాబిన్ ఊతప్ప బౌండరీకి తరలించాడు.
|
సోషల్ మీడియాలో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ ముందుగానే ఫిక్సయింది అనడానికి ఇదే నిదర్శనం అంటూ ఆరోపిస్తున్నారు. పంత్ మాటలు స్టంప్ మైక్లో రికార్డు అయిన వీడియో ఇప్పుడు తొలగించబడింది.
|
అసలు సిసలైన టీ20 మజా
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు తలబడ్డాయి. చివరకు సూపర్ ఓవర్లో రబాడ అద్భుత బౌలింగ్తో కోల్కతాను కట్టడి చేసి ఢిల్లీ క్యాపిటల్స్కు విజయాన్నందించాడు.
|
సూపర్ ఓవర్ ద్వారా ఫలితం
సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలిన ఈ మ్యాచ్లో ఢిల్లీ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ ఆరు వికెట్ల నష్టానికి అంతే స్కోరు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీసింది. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ 10 పరుగులు చేయగా.. రబాడా కోల్కతాను 7 పరుగులకే కట్టడి చేసి ఢిల్లీకి విజయాన్నందించాడు.