హైదరాబాద్: త్వరలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టి20, వన్డే సిరీస్ జరగనుందిది. ఈ సందర్భంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తమ మ్యాచ్ ప్రణాళికల గురించి, టీమిండియా గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా ఫించ్ మాట్లాడుతూ "భారత్ ప్రమాదకర జట్టు అని సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అంత సులువైన విషయం కాదు" అని చెప్పాడు.
పాండ్యాతో మంచి స్నేహం ఉంది: విజయ్ శంకర్
అయితే తమ జట్టు ఆత్మ విశ్వాసంతో ఉందని భారత్ ను ధీటుగా ఎదుర్కో గలదని విశ్వాసాన్ని వ్యక్త పరిచాడు. "భారత్ సొంతగడ్డపై తిరుగు లేని శక్తి. ఇప్పటీకే చాలా విజయాలతో టీమిండియా ఏంటో నిరూపించింది. కానీ మేము భారత్ కోసం ప్రత్యేక మైన ప్రణాళికలతో బరిలో దిగబోతున్నాం. తమ ఆత్మ విశ్వాసాన్ని తిరిగి సంపాదించాలంటే భారత్ను స్వంత గడ్డమీదనే ఓడించాలని పించ్ తెలిపాడు. మేము టీమిండియాను ఓడించాడనికి అన్ని అస్త్రాలు సిద్ధం చేశాం" అని చెప్పుకొచ్చాడు.
భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు రెండు టీ20లు, ఐదు వన్డేల సుదీర్ఘ సిరిస్ ఆడనుంది. ఫిబ్రవరి 24న విశాఖ వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరిస్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై జరగనున్న సిరిస్ కావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన చాలా మ్యాచ్లు విదేశీ గడ్డ మీద జరగడంతో చాలా రోజుల తర్వాతా భారత్లో జరగడంతో స్టేడియం నిండి పోవటం ఖాయం.