నేను క్రీజు దాటి బయటకు రాను
డీన్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లో చాలా అమాయకంగా వ్యాఖ్యనించింది. ఇక మీదట క్రీజును వీడబోనని ప్రతిజ్ఞ చేసింది. డీన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్టు చేస్తూ.. 'ఈ వేసవికి ఆసక్తికరమైన ముగింపు దక్కింది. ఇంగ్లాండ్ జెర్సీలో లార్డ్స్ వేదికపై ఆడడం చాలా గౌరవప్రదంగా ఉంది. ఇక నుంచి నేను క్రీజు దాటి బయటకు రాకుండా జాగ్రత్తపడతాను. లేకుంటే ఏం జరుగుతుందో తెలిసొచ్చింది.' అంటూ ఛార్లీ డీన్ క్యాప్షన్ ఇచ్చింది.
|
హెచ్చరించామన్న దీప్తి.. అబద్ధాలొద్దన్న నైట్
ఇకపోతే ఈ మ్యాచ్లో ఛార్లీ డీన్ పదేపదే క్రీజు దాటి బయటికి వచ్చిందని, చాలా చాలాసార్లు డీన్ను తాము హెచ్చరించామని దీప్తి చెప్పింది. అయితే డీన్ తనకు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదని పేర్కొంది. ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ సైతం భారత ప్లేయర్లు అబద్ధాలు ఆడకండంటూ ఓ ప్రకటనలో అంది. ఏదేమైనా ఈ వ్యవహరాం హాట్ టాపిక్గా మారింది. ఇంగ్లాండ్ మాజీలు, ప్రస్తుత ప్లేయర్లు సైతం దీన్ని క్రికెట్ స్పిరిట్కు వ్యతిరేకం అని పేర్కొంటుండగా.. భారత అభిమానులు, మాజీ ప్లేయర్లు దీప్తి కరెక్ట్ అంటూ పేర్కొంటున్నారు.
వెక్కివెక్కి ఏడ్చిన డీన్ పాప
ఇకపోతో చివరి వన్డేలో డీన్ 47పరుగులతో మంచి ప్రతిఘటన కనబర్చింది. ఒంటి చేత్తో ఇంగ్లాండ్ను విజయతీరాలకు చేర్చడానికి శాయశక్తుల ప్రయత్నించింది. ఆమె ఫ్రెయా డేవిస్తో కలిసి చివరి వికెట్కు 35పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించింది. ఇక 17పరుగులు అవసరం అయిన దశలో సడెన్గా మన్కడింగ్ విధానంలో ఆమె రనౌట్ కావడంతో షాక్కు గురైంది. బోరున ఏడ్చేసింది. ఆమెను డేవిస్ ఓదార్చింది. ఇక ఈ సిరీస్లో డీన్ 54సగటుతో 108పరుగులు చేసింది. మూడు వికెట్లు కూడా తీసుకుంది.