
అధ్యక్షుడు, కార్యదర్శిల పదవీకాలం మూడేళ్లు ఉండేలా
ఈ సమావేశంలో బోర్డు అధ్యక్షుడు, కార్యదర్శిల పదవీకాలం మూడేళ్లు ఉండేలా సవరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలంటే బోర్డు సభ్యుల్లో నాలుగింట మూడో వంతు మద్దతు అవసరం. అలాగే బోర్డు సభ్యులు మద్దతు తర్వాత సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి.

రాజ్యాంగ సవరణ వార్తలపై
బీసీసీఐ రాజ్యాంగ సవరణ వార్తలపై గోపాల్ శంకర నారాయణన్ మాట్లాడుతూ "వాస్తవానికి ఇలాంటి ప్రయత్నాలు కోర్టు తీర్పును అపహాస్యం చేయడమే అవుతుంది. వెంటనే ఈ విషయంలో కోర్టు తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ బోర్డు సభ్యులు చేస్తున్న ప్రతిపాదనలు ఆమోదం పొందితే ఇన్నాళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు వృథా అయినట్టే" అని అన్నారు.

మెజారిటీ సభ్యుల ఆమోదం పొందినా
"మళ్లీ పాత రోజులకు వెళ్లినట్టే. కోర్టు పట్టించుకోకుంటే దాన్ని కూడా వారు అనుకూలంగా మార్చుకుంటారు. మా ప్రయత్నాలను అడ్డుకోలేదు కాబట్టి మరిన్ని సవరణలు చేస్తామంటారు. బోర్డు ప్రతిపాదనలకు ఏకగ్రీవం లేక మెజారిటీ సభ్యుల ఆమోదం పొందినా కూడా ఈ విషయంలో కల్పించుకునేందుకు సుప్రీం కోర్టుకు అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.

ఆరేళ్ల క్రితం ఐపీఎల్లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్
ఆరేళ్ల క్రితం ఐపీఎల్లో వెలుగు చూసిన మ్యాచ్ ఫిక్సింగ్ కారణంతో భారత క్రికెట్ బోర్డు ప్రక్షాళన కోసం జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ను అప్పట్లో సుప్రీం కోర్టు నియమించింది. లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల కారణంగా బీసీసీఐ రాజ్యాంగంలో చాలా మార్పులో చోటు చేసుకున్నాయి.

కూలింగ్ ఆఫ్ పీరియడ్
ముఖ్యంగా ఆఫీస్ బేరర్ల గరిష్ఠ పదవీ కాలం, కూలింగ్ ఆఫ్ పీరియడ్ వంటి నిబంధనలు చాలా మందికి మింగుడు పడకుండా చేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే కొత్తగా ఎంపికైన బీసీసీఐ బోర్డు సభ్యులు కొన్ని నిబంధలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించేందుకు సిద్ధమయ్యారు.


Click it and Unblock the Notifications












