నెం.1 స్థానంలో సచిన్:
సచిన్ టెండూల్కర్ సాధించిన 100 సెంచరీలలో.. 49 శతకాలు వన్డేల్లో సాధించాడు. మిగిలిన 51 శతకాలు టెస్టుల్లో నమోదు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఇప్పటికే వన్డేల్లో 43 సెంచరీల మైలురాయిని అందుకుని సచిన్ రికార్డ్కి చేరువయ్యాడు. ఇక టెస్టుల్లో విరాట్ సాధించిన శతకాలు 27 మాత్రమే. అయితే సచిన్ తరహాలో సుదీర్ఘంగా కెరీర్ని, ఇప్పటి ఫామ్ను ఇలానే కొనసాగించగలిగితే.. కోహ్లీ 100 సెంచరీలు నమోదు చేయగలడు అని బ్రాడ్ హగ్ వెల్లడించాడు. మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నారు కాబట్టి 100 సెంచరీల రికార్డ్ను కోహ్లీ బ్రేక్ చేయగలడన్నాడు.
రికార్డు బ్రేక్ చేయగలడు:
తాజాగా బ్రాడ్ హగ్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ కచ్చితంగా 100 సెంచరీల రికార్డుని బ్రేక్ చేయగలడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడే రోజుల్లో ఫిట్నెస్ లెవల్స్తో పోలిస్తే ఇప్పుడు.. ఫిట్నెస్ ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు జట్టులో ఫిట్నెస్ ట్రైనర్, ఫిజియో, డాక్టర్ రూపంలో అందరూ ఆటగాళ్లకి అందుబాటులో ఉన్నారు. క్రికెటర్కి ఏ చిన్న గాయమైనా.. వాళ్లు వెంటనే కేర్ తీసుకుంటున్నారు. ఇవన్ని కాకుండా.. మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నారు కాబట్టి సచిన్ రికార్డ్ని కోహ్లీ బ్రేక్ చేయగలడు. ప్రస్తుత రికార్డులను చూస్తే.. కోహ్లీకి మాత్రమే ఆ అవకాశం ఉంది' అని అన్నాడు.
కోహ్లీకి అంత ఈజీ కాదు:
100 సెంచరీల రికార్డ్ను అధిగమించడం విరాట్ కోహ్లీకి అంత ఈజీ కాదని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. కాకపోతే విరాట్ ఆ ఫీట్ను అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 'వంద సెంచరీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా. కాకపోతే అది చాలా కష్టమైన పని. వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల (43) రికార్డ్ని బ్రేక్ చేయడం కోహ్లీకి సాధ్యమే. కానీ 100 సెంచరీల రికార్డ్ని బ్రేక్ చేయడం మాత్రం అంత సులువు కాదు. ఆ రికార్డ్ అధిగమించడం అనేది కోహ్లీ ఫిట్నెస్, కెరీర్ను కొనసాగించడంపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ సచిన్ తరహాలో సుదీర్ఘ కెరీర్ని (24 ఏళ్లు) కోహ్లీ కొనసాగించగలిగితే అతను 100 సెంచరీల రికార్డ్ని సాధించగలడు' అని ఇర్ఫాన్ వెల్లడించాడు.
రెండో స్థానంలో పాంటింగ్:
24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు నమోదు చేశాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్కి సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినా.. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో 100 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 అంతర్జాతీయ శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రికీ టెస్టుల్లో 41, వన్డేల్లో 30 సెంచరీలు బాదాడు. ఇక మూడో స్థానంలో కోహ్లీ ఉన్నాడు. రికీని అధిగమించడం కొద్ది రోజుల్లోనే మనం చూడవచ్చు.