|
ట్విట్టర్లో రిషబ్ పంత్ ఇలా
ఇందుకు సంబంధించిన ఫొటోలను విరాట్ కోహ్లీ, యజువేంద్ర చాహల్, రిషబ్ పంత్లు ట్వీట్టర్లో పంచుకున్నారు. "చక్కని సాయంత్రం వేళ మంచి విందు ఇచ్చి... బాబీజి (వదిన) మా ఫిట్నెస్ స్థాయిలను పాడు చేస్తోంది" అంటూ రిషబ్ పంత్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్లో ఇలా
"ఈ అందమైన రాత్రి నా సహచర ఆటగాళ్లతో కలిసి మహీ భాయ్ ఇంట్లో చేసిన విందుని ఎప్పటికీ మరచిపోలేను. ఈ ఆత్మీయ కలయిక మాలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. అం దరం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. వంటకాలు చాలా బాగున్నాయి" అని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
|
చాహల్ ఇలా
మహీ భాయ్.. సాక్షి భాబీకి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు.
|
ధోని తన వాహనంలో
అంతకు ముందు రాంచీ విమానాశ్రయంలో ఆటగాళ్లకు భారీ స్వాగతం లభించింది. కేదార్ జాదవ్, రిషభ్ పంత్ తదితరులను ధోనీ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తన హమ్మర్ వాహనంలో తీసుకెళ్లాడు. బహుశా మిస్టర్ కూల్కు తన సొంత మైదానంలో ఇదే చివరి వన్డే అని భావిస్తున్నారు. ప్రపంచకప్ తర్వాత అతడు క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.