
అజిత్ సింగ్ లేఖ
ఈ మేరకు క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే అసోసియేషన్లకు శనివారం అజిత్ సింగ్ లేఖ రాశాడు. అందులో భవిష్యత్తులో ఆటగాళ్లకు సెక్యూరిటీ లోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారిందని... అది ప్రమాదకరమైన పరిస్థితికి కూడా దారితీస్తుందని తెలిపారు.

భద్రతా ఏర్పాట్లు లేని కారణంగా
భద్రతా ఏర్పాట్లు లేని కారణంగా అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ళపై తమ ప్రేమను చూపించడానికి కొన్నిసార్లు అతి చేయడాన్ని కూడా మనం చూశామని ఆ లేఖలో పేర్కొన్నారు. "ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 రద్దవడంతో టీమిండియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రెండో మ్యాచ్ కోసం మొహాలికి ముందుగానే చేరుకున్నారు" అని అన్నాడు.

చండీగఢ్ పోలీసులు అలా!
"స్థానిక అసోసియేషన్తో ఉన్న సమస్యల కారణంగా క్రికెటర్లకు చండీగఢ్ పోలీసులు సెక్యూరిటీ కల్పించలేదు. తొలి రోజు హోటల్ యాజమాన్యమే ఆటగాళ్లకు ప్రైవేట్ సెక్యూరిటీని కల్పించింది. రెండో రోజుకు చంఢీగడ్ పోలీసులు ఆటగాళ్లకు భదత్ర కల్పించలేదు. ఇది చాలా విచారకరం. క్రికెటర్లకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత అసోసియేషన్లదే" అని అందులో ఆయన పేర్కొన్నారు.

మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని
"రెండో టీ20లో మైదానంలోకి అభిమానులు దూసుకొచ్చారు. లాంగాఫ్, లాంగాన్, మిడాన్, మిడాఫ్, డీప్ థర్డ్మన్ వంటి ఫీల్డింగ్ పొజిషన్ల నుంచి బయటివాళ్లు మైదానంలోకి దూసుకొస్తున్నారు. దీంతో ఆయా స్థానాల వద్ద ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించాలి. మరోసారి మొహాలి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా వహించాలి" అని అసోసియేషన్లకు ఘాటుగా రాశారు.


Click it and Unblock the Notifications












