సస్పెన్సన్ను ఎత్తివేయడంపై
అయితే, వీరిద్దపై ఉన్న సస్పెన్సన్ను ఎత్తివేయడంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వారిద్దరూ తగిన శిక్ష అనుభవించారని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేయగా... మరికొందరు వారి సేవలు జట్టుకు అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న జట్టు కూర్పు బాగుందని ఇంకొందరు తెలిపారు.
విచారణ లేకుండానే
హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్పై అసలెందుకు వేటు వేశారు? విచారణ లేకుండానే ఎత్తివేశారని బీసీసీఐపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.'కాఫీ విత్ కరణ్' షో టాక్ షోలో మహిళలపై విమర్శలు చేయడంతో దుమారం రేగడంతో వీరిద్దరిపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
అంబుడ్స్మన్కు నిరాకరించిన సుప్రీం
హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లను విచారించి తుది నిర్ణయం తీసుకునేందుకు వెంటనే అంబుడ్స్మన్ను నియమించాలని బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. కోర్టు సహాయకుడిగా మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహను మాత్రమే నియమించి ఇప్పటికిప్పుడు అంబుడ్స్మన్ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ప్రకటించిన సీఓఏ
తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టడంతో అతనితో చర్చించిన తర్వాత బీసీసీఐ పాలకుల కమిటీ పాండ్యా, రాహుల్పై గురువారం సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్పాండ్యా లేకపోవడంతో జట్టు కూర్పు కుదరడం లేదని, సమతూకం కష్టమవుతోందని టీమిండియా కెప్టెన్ కోహ్లీ తొలి వన్డే అనంతరం చెప్పిన సంగతి తెలిసిందే.