మా ఆటతీరు సానుకూలంగానే ఉంది
"మొత్తంగా చూసుకుంటే మా ఆటతీరు సానుకూలంగానే ఉంది. కానీ, మా మీద ఉంచిన అంచనాలను అందుకోలేకపోయాం. చివరి మ్యాచ్లో గెలిచినా.. టాప్ ఐదో స్థానంలో ఉండేవాళ్లం. కానీ, అభిమానులు మాత్రం మమ్మల్ని సెమీస్కు చేరుకోవాలని కోరుకున్నారు. దురుదృష్టవశాత్తు అది జరగలేదు" అని మొర్తాజా తెలిపాడు.
7 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో
7 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచి.. ప్రపంచకప్ లీగ్ దశలోనే బంగ్లాదేశ్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆప్ఘనిస్థాన్ జట్లను ఓడించిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియా, ఇండియా జట్లకు గట్టి పోటీనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, భారత్, పాక్ చేతిలో ఓడిపోగా... టోర్నీ లీగ్ మ్యాచ్లో సఫారీలు ఆస్ట్రేలియాను ఓడించడంతో బంగ్లా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.
సెమీస్ అవకాశాలు సజీవంగానే!
"భారత్తో మ్యాచ్ వరకు మాకు సెమీస్ అవకాశాలు సజీవంగా నిలిచాయి. కానీ, షకీబ్, ముష్ఫిక్ రహీం తప్ప మిగతా ఆటగాళ్లు నిలకడగా రాణించకపోవడం తమ అవకాశాలను దెబ్బతీసింది" అని మొర్తాజా వెల్లడించాడు. ఈ వరల్డ్కప్లో షకీబ్, ముష్ఫిక్తోపాటు ఆల్రౌండర్ మహమ్మద్ సైఫుద్దీన్ కూడా అద్భుతంగా రాణించాడని మొర్తాజా తెలిపాడు.