|
ఇక సరిపెట్టుకో. ఇలాగైతే 2-0తేడాతో ఓడిపోతారు
ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతున్న నాలుగో రోజు మ్యాచ్లో భాగంగా ఆసీస్ ఓవర్ నైట్ స్కోరు 132/4తో ఇన్నింగ్స్ ఆరంభించి దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే కోహ్లీ.. పైన్ ఇక సరిపెట్టుకో. ఇలాగైతే 2-0తేడాతో ఓడిపోవడం ఖాయమన్నాడు. దానికి ధీటుగా చూద్దాం. ఇంకా మ్యాచ్ ముందుంది అనే అర్థం వచ్చేలా టిమ్ బదులిచ్చాడు. ఈ విషయం ముగిసిన కాసేపటి వరకూ ఇంకా వేడిగానే కనిపించింది అక్కడి వాతావరణం.
|
కోహ్లీని రెచ్చగొట్టేలా వాదనకు రమ్మంటూ
ఆ తర్వాత కోహ్లీ ప్రశాంతంగా కనిపించినా.. పైనె మాత్రం కోహ్లీని రెచ్చగొట్టేలా వాదనకు రమ్మంటూ కనిపించాడు. అక్కడ సంభాషణ ఇలా జరిగింది.
టిమ్ పైనె.. కోహ్లీతో: నిన్నటి మ్యాచ్ ఓడిపోయారు కదా. ఇవాళ ఏమీ చేయలేకపోతున్నావే.
అంపైర్: ఓయ్.. ఇక చాలు.. చాలు
పెనై: మేము మాట్లాడుకునేందుకు అనుమతి ఉంది.
అంపైర్: కాదుకాదు. రా వచ్చి ఆట ఆడు. మీరద్దరూ కెప్టెన్లు అలా ప్రవర్తించకూడదు.
పెనై: మేము సంభాషించుకోవచ్చు కదా. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదుగా.
అంపైర్: టిమ్ నువ్వు కెప్టెన్?
పైనె: కోహ్లీ నీ ప్రశాంతతను అలాగే ఉంచుకో..
|
నేరుగా అతణ్ని గుద్దుకుని వెళ్లిపోవాల్సింది
ఇక ఈ సంభాషణతో ఆసీస్ క్రికెట్ అభిమానులకు అవకాశం దొరికినట్లు అయింది. 'ఆ నవ్వేంటి. కోహ్లీ ఉన్నాడని పైనె ఆగకుండా ఉండాల్సింది. నేరుగా అతణ్ని గుద్దుకుని వెళ్లిపోవాల్సింది. మ్యాచ్ గెలిచి అతనికి సరైన సమాధానం చెప్పాలి', 'కోహ్లీ ప్రదర్శన అస్సలేం బాగాలేదు. మ్యాచ్ గెలిస్తే సరైన సమాధానం దొరుకుతుంది' 'టిమ్ పైనె మాట్లాడుతుంటే అంపెర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసుకుంటున్నాడు. పైనె సరిగ్గానే స్పందించాడు. కోహ్లీని మైదానంలో చిత్తుగా ఓడించాలి' అంటూ కామెంట్లతో విమర్శల దాడికి దిగుతున్నారు.