తొలి ఇన్నింగ్స్ని 622/7తో డిక్లేర్ చేసిన భారత్
గురువారం సెంచరీ మార్క్ని అందుకున్న చతేశ్వర్ పుజారా (193: 373 బంతుల్లో 22ఫోర్లు) శుక్రవారం కొద్దిలో డబుల్ సెంచరీని చేజార్చుకోగా.. రిషబ్ పంత్ (159 నాటౌట్: 189 బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సు) వన్డే తరహా ఇన్నింగ్స్తో రెచ్చిపోయాడు. అతనికి తోడుగా రవీంద్ర జడేజా (81: 114 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సు) కూడా బ్యాట్ ఝళిపించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ని 622/7తో డిక్లేర్ చేసింది.
ఏడో వికెట్కి 204 పరుగుల భాగస్వామ్యంతో
పంత్- జడేజా జోడీ ఏడో వికెట్కి 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. మ్యాచ్లో 26 ఓవర్లు వేసిన మిచెల్ స్టార్క్ 123 పరుగులిచ్చి రహానె వికెట్ పడగొట్టగా.. 35 ఓవర్లు వేసిన హేజిల్వుడ్ 105 పరుగులిచ్చి కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పాట్ కమిన్స్ అయితే.. 28 ఓవర్లు వేసి 101 పరుగులు ఇచ్చినా.. కనీసం ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే..

178 పరుగులిచ్చినా 4 వికెట్లను
స్పిన్నర్ నాథన్ లయన్ మాత్రం 178 పరుగులిచ్చి.. మయాంక్, పుజారా, విహారి, జడేజా రూపంలో నాలుగు వికెట్లు పడగొట్టగలిగాడు. భారత్ బ్యాట్స్మెన్ని కవ్వించడంలో తెగ ఉత్సాహం చూపిస్తూ వచ్చిన మిచెల్ స్టార్క్.. కనీసం ఒక మెయిడిన్ ఓవర్ కూడా వేయలేకపోవడం కొసమెరుపు.


Click it and Unblock the Notifications












