మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది
"ఈ మ్యాచ్లో టాస్ గెలవడం.. బ్యాటింగ్ ఎంచుకోవడం అన్నీ మాకు కలిసొచ్చాయి. జేసన్ పునరాగమనం, బెయిర్స్టో విధ్వంసం ఇలా. ఓపెనర్ల భారీ భాగస్వామ్యం భారీ లక్ష్యాన్ని నిర్ధేశించేలా చేసింది. చైనామన్ స్పిన్నర్లపై జేసన్ రాయ్, బెయిర్స్టో విరుచుకుపడటం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది" అని మోర్గాన్ అన్నాడు.
భారీగా పరుగులిచ్చిన కుల్దీప్, చాహల్
గత నాలుగేళ్లుగా ఎలాంటి క్రికెట్ అయితే ఆడుతున్నామో ఈ మ్యాచ్లో కూడా ఎలాంటి బెరుకు లేకుండా ఆడామని మోర్గాన్ తెలిపాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో భారత చైనామన్ స్పిన్నర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 10 ఓవర్లు వేసిన చాహల్ ఏకంగా 88 పరుగులు సమర్పించుకుని ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
ఇంగ్లాండ్ సెమీస్ ఆశలు సజీవం
ఇక, కుల్దీప్ యాదవ్ సైతం 72 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లియాం ప్లెంకెట్ మూడు వికెట్లు తీయగా... క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీశాడు. తాజా విజయంతో ఇంగ్లాండ్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసిన ఇంగ్లాండ్
చివరి మ్యాచ్లో న్యూజిలాండ్తో గెలిస్తే ఇంగ్లాండ్ సెమీస్కు చేరుతుంది. ఇక, ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సెమీస్కు వెళ్తుంది.
అంతకముందు జానీ బెయిర్ స్టో(111), బెన్ స్టోక్స్(79), జేసన్ రాయ్(66) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది.