ఫీజులో 15 శాతం కోత.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా:
ఇందులో వేర్వేరు సందర్భాల్లో అఫ్గానిస్థాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మొహమ్మద్ అస్గర్.. పాకిస్థాన్ ఆటగాడు హసన్ అలీ నిబంధనలను ఉల్లంఘించారని అంపైర్లు అనిల్ చౌదరి, షౌన్ జార్జ్, మూడో అంపైర్ రోడ్ టుకెర్, నాలుగో అంపైర్ అనిస్ ఉర్ రహ్మాన్ గుర్తించారు. దీంతో ముగ్గురు ఆటగాళ్ల మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ జరిమానాతో పాటు ముగ్గురు క్రికెటర్ల ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా చేర్చింది.
క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని..
హసన్, అస్గర్ మైదానంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని.. ఆ తీరు ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.1.1 ను ఉల్లంఘించినట్లేనని ఐసీసీ పేర్కొంది. ఇక రషీద్ తన భాష, మైదానంలో ప్రవర్తించిన తీరుతో ఆర్టికల్ 2.1.7 నిబంధనను ఉల్లంఘించాడని తెలిపింది.
నిబంధనలను ఉల్లంఘించిన రషీద్ ఖాన్
కాగా, శుక్రవారం జరిగిన మ్యాచులో పాకిస్థాన్ లోయర్-ఆర్డర్ బ్యాట్స్మెన్ అసిఫ్ అలీ ఔట్ అయిన సందర్భంలో ఆయన వైపునకు చేతి వేలును చూపుతూ అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నిబంధనలను ఉల్లంఘించాడు. 37వ ఓవర్లో అఫ్గానిస్థాన్ పేసర్ హసన్ అలీని చూస్తూ అస్గర్ తన భుజాలను చేతులను రుద్దుకుంటున్నట్లు ప్రవర్తించాడు.
బంతి చేతిలో లేనప్పటికీ నటించినందుకు
ఇక 33వ ఓవర్లో బంతి చేతిలో లేనప్పటికీ దాన్ని అఫ్గానిస్థాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హస్మతుల్లా షాహిది వైపునకు విసురుతున్నట్లు నటించినందుకు గానూ పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీకి జరిమానా విధించారు.