అత్యుత్తమ బౌలింగ్ మా సొంతం
తాజాగా టీమ్ పైనీ మాట్లాడుతూ... 'గత సంవత్సరం ట్యాంపరింగ్ కుంభకోణం నేపథ్యంలో జట్టు కష్టాలను ఎదుర్కొంది. ప్రస్తుతం జట్టు బాగుంది. ఈ జట్టు ఆస్ట్రేలియా క్రికెట్లోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ ఉంది. గొప్ప బ్యాటింగ్ లైనప్కు కూడా మా సొంతం' అని పేర్కొన్నాడు.
బీబీఎల్కు దూరం:
ఆసీస్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని త్యాగాలను చేయడానికి సిద్ధమయ్యా. జట్టును ముందుండి నడిపించడంపైనే దృష్టి పెడుతున్నా. ఈ నేపథ్యంలోనే బీబీఎల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఒక కెప్టెన్గా నాకొచ్చి ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే నేను రీచార్జ్ కావాల్సి ఉంది. అందుకే బీబీఎల్కు స్వస్తి చెపుతున్నా. నా టెస్టు కెరీర్ ముగిసిన తర్వాతే బీబీఎల్లో అడుగుపెడతా' అని పైనీ ఎతెలిపాడు.
దృష్టంతా నా బాధ్యతపైనే:
'ప్రస్తుతం నా దృష్టంతా నాపై ఉన్న బాధ్యతపైనే ఉంది. టెస్ట్ జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా. చివరి టెస్ట్ ముగిసే సమయానికి నా బొటనవేలు విరిగింది. నాతో పాటు పీటర్ సీడెల్ కూడా తుంటి గాయంతో సతమతమయ్యాడన్నాడు. గాయాలు పెద్దగా ఆందోళన పరిచేవి కాకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తదు' అని పైనీ చెప్పుకొచ్చాడు. ఆసీస్ తన తదుపరి టెస్టును పాకిస్తాన్తో ఆడనుంది. గబ్బా స్టేడియంలో నవంబర్ 21వ తేదీన ఈ టెస్టు మ్యాచ్ జరగనుంది.