ఝలన్గా మారిపోవడానికి అనుష్క అన్ని ప్రయత్నాలు చేస్తోంది
ఈ మూవీ ప్రొడక్షన్కు సంబంధించిన ఓ వ్యక్తి అనుష్క శిక్షణ గురించి మాట్లాడాడు. 'అనుష్క తెరపై ఝులన్గా మారడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఆమె అందుకు తగ్గట్లు తన శరీరాన్ని సిద్ధం చేస్తోంది. ఆమె సినిమాలో క్రికెట్ పార్ట్ చిత్రీకరించడానికి ముందు లీడ్స్లో తన క్రికెట్ నైపుణ్యాలను పెంచుకునేందుకు కసరత్తులు చేయబోతుంది.
జనవరి నెలలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. నిర్మాతలు కాస్త లేటుగా రిలీజ్ చేసే అవకాశముంది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అనుష్క ఎంతో నిబద్ధత కలిగిన కళాకారిణి. ఆమె తన పాత్రకు న్యాయం చేయాలని తపిస్తోంది. ఆమె ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ వరకు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ముందు ఆమె పూర్తిగా ప్రిపేర్ అవుతుంది.' అని పేర్కొన్నాడు.
281 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఝలన్ గోస్వామి
ఇక ఝలన్ గోస్వామి విషయానికొస్తే.. పశ్చిమ బెంగాల్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన 39ఏళ్ల గోస్వామి ప్రస్తుతం భారత మహిళల క్రికెట్లో ఓ లెజెండ్. ఆమె 281అంతర్జాతీయ మ్యాచ్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. 352వికెట్లు తీసింది. గోస్వామి 2007లో ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించింది. 2008లో ఆమె భారత మహిళల జట్టుకు కెప్టెన్గా ఎంపికైంది. వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించింది.
సినిమా పరంగా బాగున్నా.. మరీ ఫలితం ఎలా ఉంటుందో..?
ఇక బయోపిక్ల విషయానికొస్తే.. ఎంఎస్ ధోని బయోపిక్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోనీలా మారిపోయి నటించిన విధానం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.
అదేవిధంగా '83'లో రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్గా నటించి మెప్పించాడు. ఆ చిత్రం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇకపోతే తాప్సీ పన్ను మిథాలీరాజ్గా నటించిన చిత్రం శభాష్ మిథు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు. ఈ చిత్రానికి మిశ్రమ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మరో మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్లో అనుష్క శర్మ నటించనుండడంతో ఆమెపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సినిమా పరంగా ఎంత బాగున్నా.. ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందనేది కాస్త సంకోచించాల్సిన విషయం.