తొలి ఇన్నింగ్స్ను 443/7తో డిక్లేర్ చేసిన భారత్
ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి రెండు రోజులు క్రీజులో పాతుకుపోయారు. ముఖ్యంగా పుజారా (106) సెంచరీతో మెరవగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (82) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ను 443/7తో డిక్లేర్ చేసింది. మూడో రోజు నుంచి పిచ్ బౌన్స్కు సహకరించడంతో బ్యాటింగ్ చేయడం కష్టమైపోయింది.
బౌలర్లకి ఈ పిచ్ నుంచి అతిగా సహకారం
బౌలర్లకి ఈ పిచ్ నుంచి అతిగా సహకారం లభించడంతో జస్ప్రీత్ బుమ్రా (6/33) చెలరేగిపోవడంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే, ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ, కోహ్లీ అలా చేయకుండా రెండో ఇన్నింగ్స్ను 106/8 వద్ద డిక్లేర్ చేశాడు.
|
399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్
దీంతో ఆతిథ్య జట్టుకు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆతిథ్య జట్టు 261 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో టీమిండియా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం పిచ్ నుంచి అస్థిర బౌన్స్ని చూసిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ‘యావరేజ్' రేటింగ్తో ఐసీసీకి నివేదిక సమర్పించాడు.
గురువారం నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు
కాగా, నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య జనవరి 3(గురువారం) నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్కి కూడా జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు.