పుజారాపై సౌరాష్ట్ర జట్టు ఎన్నో ఆశలు
ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 521 పరుగులతో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పుజారాపై సౌరాష్ట్ర జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే, విదర్భతో జరిగిన ఫైనల్లో పుజారా దారణంగా విఫలమయ్యాడు. రంజీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి జట్టు ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.
సెమీస్లో అంపైర్ తప్పిదం కారణంగా
కర్ణాటకతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సెమీస్లో అంపైర్ తప్పిదం కారణంగా రెండుసార్లు బతికిపోయిన పుజారా 45, 131 నాటౌట్ చొప్పున పరుగులు సౌరాష్ట్రను ఫైనల్కు చేర్చాడు. దీంతో రంజీ ట్రోఫై ఫైనల్లో పుజారాని త్వరగా పెవిలియన్ కు చేర్చేందుకు గాను విదర్భ జట్టు ప్రత్యేక వ్యూహాలు రూపొందించింది.
పక్కా ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసిన ఆదిత్య
పక్కా ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసిన ఆదిత్య సర్వాతే.. రెండు ఇన్నింగ్స్ల్లోనూ పుజారాను పెవిలియన్ చేర్చాడు. కీలక సమయంలో పుజారా పెవిలియన్కు చేరడంతో విజయం విదర్భ సొంతమైంది. అంతేకాదు విదర్భ జట్టు వరుసగా రెండోసారి రంజీ విజేతగా నిలిచింది. పుజారాను ఎదుర్కోవడం కోసం విదర్భ కోచ్ చంద్రకాంత్ పండిట్ ప్రత్యేకంగా వ్యూహాలు రూపొందించాడు.
స్లిప్, సిల్లీ పాయింట్లలో ఫీల్డర్లను
ఇందులో భాగంగా స్లిప్, సిల్లీ పాయింట్లలో ఫీల్డర్లను మోహరించి పుజారాపై ఒత్తిడి పెంచారు. పుజారా క్రీజ్లోకి రాగానే షార్ట్ లెగ్ ఇన్లో ఫీల్డర్ను మోహరించారు. పుజారా క్రీజులోకి రాగానే అతడు వీక్గా ఉన్న ఏరియాలో ఫీల్డర్లను ఉంచడం ద్వారా ఒత్తిడి పెంచామని... అతడు క్రీజ్లోనే ఉండి బంతిని ఎదుర్కొనేలా సరైన ప్రాంతంలో బంతులు విసిరి ఫలితం రాబట్టామని మ్యాచ్ అనంతరం విదర్భ బౌలర్ ఆదిత్య సర్వాతే వెల్లడించాడు.
రెండో ఇన్నింగ్స్లో 59 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు
ఈ మ్యాచ్లో ఆదిత్య సర్వాటె మ్యాచ్లో మొత్తం 11 వికెట్లు తీసి సౌరాష్ట పతనాన్నిశాసించాడు. నాలుగో రోజు సౌరాష్ట్ర టాపార్డర్ను దెబ్బ తీసిన ఆదిత్య.. చివరి రోజైన గురువారం మరో మూడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో 98 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన ఆదిత్య సర్వాతే... రెండో ఇన్నింగ్స్లో 59 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. అతనికి తోడుగా అక్షయ్ వాఖరే మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్ వికెట్ తీశాడు.