వన్డే క్రికెట్లో 5వేల పరుగులకు
అతని వన్డే కెరీర్లో 5000పరుగులు చేరుకోవడానికి 65 పరుగుల దూరం మాత్రమే ఉంది. ఈ క్రమంలో చాలా తక్కువ ఇన్నింగ్స్లో 5వేల పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్లో రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. విరాట్ కోహ్లీ 114ఇన్నింగ్స్లలోనే 5వేల పూర్తి చేయగా.. ఇప్పటివరకూ 13 మంది భారతీయులు 5000పరుగుల జాబితాలో ఉన్నారు. హషీమ్ ఆమ్లా ఇన్ని పరుగులు సాధించడానికి కేవలం 101 ఇన్నింగ్స్ సమయం మాత్రమే తీసుకున్నాడు.
పది వేల క్లబ్ చేరేందుకు ధోనీ ఎదురుచూపులు:
ఫామ్లో లేడంటూ పలు విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పదివేల క్లబ్లో చేరేందుకు ఎదురుచూపులు చూస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితిల్లో అంతగా రాణించలేకపోతున్న ధోనీ.. స్టంప్ల వెనుక కీపింగ్లో ఏ మాత్రం వేగం తగ్గించలేదు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో కేవలం పది వేల పరుగులకు ఒక్కపరుగు దూరంలో నిలిచిన ధోనీ 2019లో ఆ ఒక్కటి చేరుకుని పదివేలు దాటనున్నాడు. ఇలా పదివేలు పరుగులు చేయనున్న భారత క్రికెటర్లలో ధోనీ ఐదో వాడిగా నిలవనున్నాడు.
20వేల పరుగుల మైలురాయి చేరుకోనున్న కోహ్లీ:
ఇటీవల ముగిసిన వెస్టిండీస్ సిరీస్తో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ.. బెస్ట్ బ్యాట్స్మన్గా నిలిచాడు. దూకుడైన ఆటతీరును ప్రదర్శించి పదివేల పరుగుల క్లబ్లో చేరడమే కాక అతి తక్కువ ఇన్నింగ్స్లో ఆ క్లబ్లో చేరి సచిన్ రికార్డును సైతం బద్దలుకొట్టాడు. రాబోయే ఏడాది 2019 కోహ్లీ జీవితంలో ఓ మైలురాయిలా నిలిచిపోనుంది. 18665అంతర్జాతీయ పరుగులు చేసి 20 వేల పరుగుల క్లబ్లో చేరనున్నాడు. దీనికి కేవలం 1335 పరుగుల దూరం మాత్రమే ఉండటంతో ఏడాది మొత్తం మీద సాధించగలడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.
100వన్డే వికెట్లు తీసేందుకు సిద్ధమవుతోన్న షమీ:
బెంగాల్ నుంచి భారత్ తరపున ఆడుతున్న భయానకమైన ఫేసర్ మొహమ్మద్ షమీ.. ప్రత్యేకించి లాంగ్ ఫార్మాట్లలో కనిపించే షమీ.. దురదృష్టవశాత్తు పరమిత ఓవర్ల క్రికెట్కు అందుబాటులో లేడు. ఈ ఫార్మాట్లో షమీ స్థానాన్ని జస్ప్రిత్ బుమ్రా కొట్టేశాడు. అయితే వన్డే క్రికెట్లో 100వికెట్లు తీయడానికి ఇంకా 3వికెట్ల దూరం మాత్రమే ఉండడంతో అవి ఈ ఏడాదైనా సాధించగలడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.