
టోర్నీ అసాంతం సఫారీలు సూపర్ ఫామ్లో
అలెన్ డొనాల్డ్, జాంటీ రోడ్స్లు సూఫర్ ఫామ్లో ఉన్నారు. అయితే, అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న సఫారీల విజయానికి సెమీస్లో ఓ అనూహ్య పరిణామం బ్రేక్ వేసింది. వర్షంతో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆ జట్టు సెమీస్లో ఓటమిపాలైన చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

దక్షిణాప్రికాకు 252 పరుగల విజయ లక్ష్యం
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు దక్షిణాప్రికాకు 252 పరుగల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో సఫారీల విజయానికి 13 బంతుల్లో 22 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. టోర్నీ అసాంతం దక్షిణాఫ్రికా ఆటగాళ్ల జోరుని చూస్తే పెద్ద లక్ష్యం కూడా కాదు.

1 బంతికి 22 పరుగులు
మెక్మిలన్ (21 నాటౌట్), రిచర్డ్సన్ (13 నాటౌట్) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో 12 నిమిషాల పాటు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఈ వర్షం సఫారీల ఓటమికి కారణమైంది. డక్వర్త్ లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని 1 బంతికి 22 పరుగులుగా అంఫైర్లు నిర్దారించారు.

కన్నీటి పర్యంతమైన సఫారీ అభిమానులు
ఇంకేముంది మ్యాచ్ ఆడుతున్న బ్యాట్స్ మెన్తో పాటు చూస్తున్న అభిమానులు సైతం ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా సఫారీ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆఖరి బంతికి సింగిల్ తీసి బ్యాట్స్మెన్ భారంగా మైదానాన్ని వీడారు. ఇలా వర్షం కారణంగా దురదృష్టం కలిసి రావడంతో సఫారీలు టోర్నీ నుంచి నిష్క్రమించారు.


Click it and Unblock the Notifications












