|
టీమిండియాదే విజయం
ఈ రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బుధవారం సఫారీలతో సౌతాంప్టన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడేసింది. ఈ రెండింటిలోనూ ఓడిపోయింది.
మ్యాచ్లో గెలవాలనే పట్టుదలతో
దీంతో మూడో మ్యాచ్లో గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉంటే, ఆ జట్టులోని కీలక ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో టీమిండియా ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ఈ వరల్డ్కప్లో మిగతా జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ అడినప్పటికీ... భారత్ మాత్రం ఇంకా ఒక్క మ్యాచ్ ఆడలేదు.
దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్
భారత్ బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. భారత్కు ఇది తొలి మ్యాచ్ కాగా.. దక్షిణాఫ్రికాకు మూడో మ్యాచ్ కావడం గమనార్హం. అయితే ప్రపంచకప్లో భారత్ తొలి మ్యాచ్ ఆలస్యంకు అసలు కారణం బీసీసీఐనే అట. ఐపీఎల్ 2019 సీజన్తో దాదాపు నెలన్నర పాటు టీమిండియా క్రికెటర్లు విశ్రాంతి లేకుండా ఆడారు.
కోహ్లీసేన ఆలస్యానికి కారణం
అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడారు. తీరిక లేని క్రికెట్ ఆడిన నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని బీసీసీఐ భావించింది. ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని బీసీసీఐ స్వయంగా ఐసీసీని కోరింది. దీంతో టోర్నీ మొదలైన వారం తర్వాత టీమిండియా తొలి మ్యాచ్ ఆడేలా ఐసీసీ షెడ్యూల్ను రూపొందించింది.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: శిఖర్ ధవన్, రోహిత్, కోహ్లీ (కెప్టెన్), రాహుల్, ధోనీ, జాదవ్/విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా: డికాక్, ఆమ్లా, మార్క్రమ్, డుప్లెసిస్, వాన్డర్ డుస్సెన్, డుమిని, ఫెలుక్వాయో, మోరిస్, ప్రిటోరియస్, రబాడ, తాహిర్.