బ్యాంకాక్లో జరుగుతున్న థామస్ ఉబెర్ కప్ - 2022లో బుధవారం జరిగిన చివరి గ్రూప్ క్లాష్లో టీమిండియా వుమెన్స్ టీం దక్షిణా కొరియాపై 5-0 తేడాతో పరాజయం పాలైంది. వరుసగా రెండు విజయాలను నమోదు చేసిన తర్వాత దక్షిణ కొరియాపై గ్రూప్ డి మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు పూర్తిగా నిరాశపరిచారు. ప్రపంచ నంబర్ 7 పీవీ సింధు సైతం ఓడిపోవడం కాస్త ఆందోళన కలిగించింది. వరుసగా రెండు సెట్లలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన దక్షిణా కొరియా ప్లేయర్ యాన్ సే-యంగ్ పీవీ సింధును ఓడించింది. 42నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సింధు 15-21, 14-21తేడాతో ఓడిపోయింది.
ఇక రెండో మ్యాచ్లో మహిళల డబుల్స్ జోడీ శ్రుతి మిశ్రా, సిమ్రాన్ సింఘీ జోడీ టీమిండియా తరఫున తలపడగా.. 39నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో 13-21, 12-21తో లీ సో-హీ-షిన్ సెంగ్-చాన్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్లో కిమ్ గా-యున్తో 10-21, 10-21 పాయింట్ల తేడాతో ఆకర్షి కశ్యప్ ఓడిపోయింది. ఆ తర్వాత 36నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో తనీషా క్రాస్టో, ట్రీసా జోలీ జోడీ 14-21, 11-21తో కిమ్ హే-జియాంగ్-కాంగ్ హీ-యోంగ్ చేతిలో ఓడిపోయారు. ఇక చివరి పోరులో.. అష్మితా చలిహా సిమ్ యు-జిన్తో తలపడింది. అష్మితా 18-21, 17-21తేడాతో ముగించడంతో భారత్ వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడి గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్లో పేలవ ప్రదర్శన చేసింది.
🇮🇳 @Pvsindhu1 goes down against World no. 4 🇰🇷’s An Seyoung in the opening match of tie 3 . #UberCup2022 #badminton pic.twitter.com/gJ1jhg6wNA
— BAI Media (@BAI_Media) May 11, 2022
ఇక ఇంతకుముందు టీమిండియా కెనడా, అమెరికాలపై వరుసగా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో థామస్ ఉబెర్ కప్ 2022యొక్క క్వార్టర్ ఫైనల్స్లో తమ స్థానాన్ని ఇప్పటికే టీమిండియా వుమెన్స్ టీం రిజర్వ్ చేసుకుంది. ఇక మెన్స్ టీం కూడా ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇక రేపు క్వార్టర్ ఫైనల్లో టీమిండియా వుమెన్స్ టీం థాయ్లాండ్తో తలపడనుంది. మరో వైపు మెన్స్ టీం క్వార్టర్ ఫైనల్కు సంబంధించిన డ్రా నేటి సాయంత్రం తీస్తారు. రేపు మధ్యాహ్నం క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది.