— Pvsindhu (Pvsindhu1) August 13, 2022 |
బ్యాండేజీతో ఆడి మరీ గెలిచింది
కెనడాకు చెందిన మిచెల్ లీతో కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు తలపడింది. ఫైనల్ మ్యాచ్లో ఆమె ఎడమ కాలుకు బ్యాండేజీ వేసుకుని ఆడింది. ఆమె గాయంతో విలవిల్లాడుతూనే వీరోచితంగా పోరాడింది. వరుసగా సింధు 21-15, 21-13 సెట్లను కైవసం చేసుకుని స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టింది. తద్వారా తొలిసారి కామన్వెల్త్ పోడియంపై తన గోల్డ్ మెడల్ అందుకుంది. ఇక ఫైనల్ టైంలో సింధు గాయం తీవ్రతను కన్పించలేదు. కానీ అది మరింత తిరగబెట్టడంతో ఆమె ప్రపంచ ఛాంపియన్ షిప్కు దూరం కాక తప్పలేదు.
హైదరాబాద్ రాగానే ఎంఆర్ఐ స్కాన్ కోసం వెళ్లా
సింధు కామన్ వెల్త్ మహిళల సింగిల్స్ ఈవెంట్లో క్వార్టర్-ఫైనల్, సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్లను గాయం వల్ల నొప్పితోనే ఆడినట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ‘సీడబ్ల్యుజీ క్వార్టర్-ఫైనల్స్లో నాకు ఎడమ మడమ వద్ద నొప్పిగా అనిపించింది. గాయం కాస్త భయాందోళ రేకెత్తించింది. కానీ నా కోచ్, ఫిజియో, ట్రైనర్ సహాయంతో.. నేను చేయగలిగినంత ప్రయత్నం చేశా. ఫైనల్లో నొప్పి భరించలేనంత తీవ్రమైంది. ఇక నేను హైదరాబాద్కు తిరిగి వచ్చిన వెంటనే MRI స్కాన్ కోసం వెళ్లాను. వైద్యులు నా ఎడమ పాదం మీద ఒత్తిడి ఫ్రాక్చర్ని నిర్ధారించారు . కొన్ని వారాల పాటు బెడ్రెస్ట్ని సిఫార్సు చేసారు. నేను కొన్ని వారాల పాటు శిక్షణకు దూరం కానున్నాను.' అని సింధు పేర్కొంది.
విజయవంతమైన భారత షట్లర్
సింధు కామన్వెల్త్ గేమ్స్లో విజయం సాధించకముందే సింగపూర్ ఓపెన్ గెలిచింది. 2019లో ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఇకపోతే ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్లో ఒక గోల్డ్, 2 రజత పతకాలు, 2 కాంస్య పతకాలను గెలుచుకున్న సింధు ఆ టోర్నీలో అత్యంత విజయవంతమైన భారతీయ షట్లర్లలో ఒకరు.