వారాంతపు సమావేశంలో మలైస్వామి
వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే 70 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు. మలైస్వామి సింధు ఆట పట్ల ఆకర్షితుడయ్యాడు. సింధు ఆటను అతడు చూసేవాడు. ఇదిలా ఉంటే.. తాజాగా రామనాథపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వారాంతపు సమావేశంలో మలైస్వామి కూడా పాల్గొన్నాడు.
జీవిత భాగస్వామిని చేసుకుంటా
సింధు ఆటతీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ ఇద్దరి ఫోటోలను జతచేసి కలెక్టర్కు మలైస్వామి అర్జీ పెట్టుకున్నాడు. పిటిషన్లో మలైస్వామి 2004 ఏప్రిల్ 4న పుట్టానని పేర్కొన్నాడు. అంటే అతని వయసు కేవలం 16గా పేర్కొన్నాడు. సింధు వయసు 24 ఏళ్లు.
కిడ్నాప్ చేసేందుకు సిద్ధం
పిటిషన్తో ఆగకుండా.. ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే.. ఆమెను అపహరించి అయినా పెళ్లి చేసుకుంటానని మలైస్వామి పేర్కొన్నాడు. చివరగా సింధుతో తన పెళ్లి చేయాలని పట్టుపట్టాడు. ఈ పిటిషన్తో కలెక్టర్తో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది నిజామా లేదా ఒక జోకా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలామంది దీనిపై చర్చించుకుంటున్నారు.