సింధు విషయానికి వస్తే
సింధు విషయానికి వస్తే, 2016 ఒలింపిక్స్లో ఫైనల్లో ఫ్రాన్స్కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓటమిపాలై రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఒలింపిక్స్లో రజత పతకం నెగ్గిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించడంతో సింధుకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది.
సింధు కంటే సైనా ముందంజ
రియో ఒలింపిక్స్ అనంతరం సింధుకు పెద్దఎత్తున బ్రాండ్ అండార్స్మెంట్స్, కమర్షియల్ యాడ్స్ ద్వారా సంపాదన పెరిగింది. దీంతో మిగతా మహిళా క్రీడాకారులందరినీ మించిపోయింది. అయితే, సోషల్ మీడియాలో సింధు కంటే సైనా నెహ్వాల్ ముందుంది. సైనాకు ట్విట్టర్లో 80 లక్షల మంది, ఇన్స్టాగ్రామ్లో 12 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
ఫేస్బుక్లో 79 లక్షల మంది
ఫేస్బుక్లో 79 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో సైనా అధికారిక సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కలిపి కోటీ 72 లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇక, సింధు విషయానికి వస్తే పీవీ సింధుకు ట్విట్టర్లో 25 లక్షలు ఫేస్బుక్లో 13 లక్షలు, ఇన్స్టాగ్రామ్లో 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
సింధుతో పోలిస్తే సైనాకే ఎక్కువ ఫాలోయింగ్
అయితే, అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కలిపి సింధును ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 లక్షలు. సింధుతో పోలిస్తే సైనాకే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం విశేషం. సంపాదనలో సింధు ముందంజలో ఉన్నప్పటికీ ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం సైనానే అగ్రస్ధానంలో ఉంది.
టాప్-100 సెలబ్రిటీల జాబితాలో
ఇటీవల ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్-100 సెలబ్రిటీల జాబితాలో సైనా నెహ్వాల్ రూ.16.54 కోట్ల ఆదాయంతో 58వ ర్యాంక్లో నిలవగా, పీవీసింధు ఈ జాబితాలో 20వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పీవీ సింధు రూ.36.5 కోట్లకు పైగా ఆర్జించిన సంగతి తెలిసిందే.