హైదరాబాద్: ఇండోనేషియాలో జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు జోరుమీదున్నారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. సైనా నెహ్వాల్ 21-6, 21-14 తేడాతో ఫిత్రియాని(ఇండోనేసియా)పై విజయం సాధించింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
తొలి గేమ్ను అవలీలగా గెలిచిన సైనా నెహ్వాల్.. రెండో గేమ్లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, రెండో గేమ్ను 21-14 తేడాతో గెలిచిన సైనా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ పోరు కేవలం అరగంటలోనే ముగియడం విశేషం. మరో షట్లర్ పీవీ సింధు కూడా క్వార్టర్స్లోకి ప్రవేశించింది.
#TeamIndia at the #AsianGames2018
— Team India (@ioaindia) August 25, 2018
Great news coming in from Jakarta as #SainaNehwal cruises past #Fitriani into the Quarter-finals of the Women's Singles #Badminton event. Some intense badminton action awaits, with all the top seeds competing!
AllTheBest @NSaina 👍🇮🇳 pic.twitter.com/i82jlGmX6F
ఇండోనేషియాకే చెందిన మరో షట్లర్ జార్జియా మారిస్కా తున్జంగ్పై 21-12, 21-15 పీవీ సింధు విజయం సాధించింది. ఇక, కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించిన సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీ పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో ఓటమి పాలైంది. కొరియా జోడీ చోయి సాల్గీ, మిన్ హ్యుక్ కాంగ్తో జరిగిన హోరాహోరీ పోరులో 17-21, 21-19, 17-21 తేడాతో ఓటమిపాలైంది.
ఇక, ఆర్చరీ రికర్వ్ విభాగంలో భారత మహిళల జట్టు కథ క్వార్టర్స్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 2-6 తేడాతో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓటమి పాలైంది.
A confident and composed display from @Pvsindhu1 ; wraps up the match in style. The Indian seed 3 looked and on a mission to win as she decimated her Indonesian opponent 21-12, 21-15, ensuring her QF berth in the process. Kudos girl!#IndiaontheRise #AsianGames2018 pic.twitter.com/UI6CaA5OeW
— BAI Media (@BAI_Media) August 25, 2018