
13 సార్లు తలపడగా 10సార్లు తైజుదే పైచేయి
దీంతో రెండో గేమ్ను సింధు 16-21తో ఓడిపోయి మ్యాచ్ను చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ 13 సార్లు తలపడగా 10సార్లు తైజుదే పైచేయి కావడం విశేషం. ఈ మ్యాచ్లో సింధు ఓడినా ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.

1982 తర్వాత సింగిల్స్లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి
1982 తర్వాత సింగిల్స్లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు సైనా నెహ్వాల్ సెమీస్లోనే ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆసియా గేమ్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ సింగిల్స్లో ఫైనల్ చేరిన తొలి భారత ప్లేయర్గా రికార్డు సృష్టించిన సింధుపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా చాలామంది ప్రముఖులు ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పీవీ సింధు మోస్ట్ టాలెంటెడ్
"పీవీ సింధు మోస్ట్ టాలెంటెడ్, స్ఫూర్తిదాయకమైన భారత అథ్లెట్. ఆమె స్కిల్స్, పట్టుదల వెల కట్టలేనివి. ఏషియాడ్లో రజతం గెలిచిన పీవీ సింధు, 125 కోట్ల భారతీయులు గర్వించేలా చేసింది" అంటూ ప్రధాని మోడీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది
"పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్లో మొట్టమొదటి సిల్వర్ సాధించింది. చరిత్రలో నిలిచేపోయే మ్యాచ్ ఆడింది" అంటూ కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications












