ఆటలో ఒకానొక దశలో ఎవరూ సర్వీస్ కోల్పోకపోవడంతో సెట్ టైబ్రేకర్కు దారి తీసింది. ఇందులో సోంగా, లోద్రా జంట నెగ్గింది. రెండో సెట్ను పేస్ - విష్ణు జోడీ గెల్చుకున్నా... కీలకమైన మూడో సెట్లో మాత్రం బ్రేక్ పాయింట్ ఇచ్చి మ్యాచ్ ఓడిపోయింది. అంతక ముందు పురుషులు డబుల్స్ విభాగంలో ఏడో సీడ్గా బరిలోకి దిగిన మహేశ్ భూపతి - రోహన్ బోపన్న జోడీ ఫ్రాన్స్ అన్ సీడెడ్ జోడీ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఫ్రాన్స్ ఆటగాళ్లైన గాస్కె - బెన్నెటె చేతిలో 6-3, 6-4 తేడాతో మహేశ్ - రోహన్లను చిత్తుగా ఓడిపోయారు. మొత్తం 77 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్లో రెండు సార్లు బ్రేక్ సాధించిన ఫ్రాన్స్ 4-1 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత భారత జోడి రెండు పాయింట్లు సాధించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 5-3కు తగ్గించారు. అయితే చివరి గేమ్లో సర్వీస్ నిలబెట్టుకున్న ఫ్రాన్స్ 6-3తో సెట్ను గెల్చుకుంది. రెండో సెట్లో తేరుకున్న భూపతి-బోపన్న వరుసగా మూడు గేమ్లు నెగ్గి 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ఫ్రాన్స్ జోడీ పుంజుకుని సెట్, మ్యాచ్ గెలుచుకుంది.
ఇక మిక్స్డ్ డబుల్స్లో పేస్, సానియా ఆట మాత్రమే మిగిలింది.
తెలుగు వన్ఇండియా