మ్యాట్పై సుశీల్ ప్రత్యర్థులతో తలపడింది కేవలం 2 నిమిషాల 33 సెకన్లే. ఆరంభ రౌండ్లలో ప్రత్యర్ధులను నిమిషంలోపే చిత్తుచేశాడు. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్లో ఎలాంటి పోటీలేకుండానే ప్రత్యర్థుల నుంచి వాకోవర్ లభించింది. దీనిని బట్టి చూస్తే మొత్తంగా స్వర్ణం సాధించడంలో సుశీల్ అన్ని రౌండ్లలో కలిపి 2 నిమిషాల 33 సెకన్లు మాత్రమే పోరాడాడు.
ఫైనల్లో అతను ప్రవీణ్ రాణాతో తలపడాల్సి ఉండగా.. అతను గాయం కారణంగా తప్పుకున్నాడు. మరోవైపు ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్, గీత ఫొగట్లు కూడా స్వర్ణం గెలుచుకున్నారు. మహిళల 62కిలోల విభాగంలో రిసాక్షి మాలిక్ 10-0 తేడాతో పూజ(హర్యానా)పై అలవోక విజయం సాధించింది.
స్వర్ణం గెలిచిన సాక్షి మాలిక్, గీతా ఫోగట్
59 కిలోల తుదిపోరులో గీతా ఫోగట్.. రవితను ఓడించి స్వర్ణం సాధించింది. ఇదిలా ఉంటే గీత ఫోగట్ భర్త పవన్ కుమార్ (86 కేజీలు) కూడా స్వర్ణం సాధించాడు. ఇదిలా ఉంటే రెజ్లర్ సందీప్ తులసీ యాదవ్పై నాడా క్రమశిక్షణ కమిటీ నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. గతేడాది అతను నిషేధిత ఉత్ప్రేరకం మెథాడియోనిన్ను తీసుకున్నట్లు జూన్ 25న జరిపిన పరీక్షలో తేలింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.