ఆర్థిక పరిస్థితి నుకూలంగా లేకపోవడం వల్లే
ఆర్థిక పరిస్థితి నుకూలంగా లేకపోవడంతో ఆతిథ్య హక్కుల్ని కోల్పోవాల్సి వచ్చింది. కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం నుంచి డర్బన్ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందకపోవడం, బిడ్ దక్కించుకున్నాక రెండేళ్ల కాల వ్యవధిలో నిర్దేశించిన సన్నాహాలు వేగవంతం చేయలేకపోవడం, బడ్జెట్ కుదిస్తూ ప్రతిపాదించిన కొత్త నమూనాను కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీడబ్ల్యూజీఎఫ్) అంగీకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో డర్బన్ ఆతిథ్య హక్కుల్ని వదులుకుంది.
దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి సైతం
తమ వద్ద తగినంత డబ్బులేకే ఆతిథ్య హక్కుల్ని వదులుకోవాల్సి వచ్చిందని దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి తెలిపారు. 'మా ప్రయత్నం మేం చేశాం. కానీ మా దగ్గర డబ్బు లేదని మా దేశం చెబుతోంది. అలాంటపుడు క్రీడలు నిర్వహించలేం' అని దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి ఇప్పటికే ప్రకటించారు.
సీడబ్ల్యూజీఎఫ్ అధికారిక ప్రకటన
దీంతో అన్ని అంశాలు పరిశీలించాక 2022 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కుల్ని డర్బన్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్టు సీడబ్ల్యూజీఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యాన్ని దక్షిణాఫ్రికా తొలిసారి దక్కించుకోవడంతో దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తమైంది.
సిద్ధమన్న లివర్పూల్ సిటీ
ఎందుకంటే ఆ దేశానికి ఈ క్రీడల ఆతిథ్యం దక్కడం అదే తొలిసారి. 2015లో జరిగిన బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నది డర్బన్ ఒక్కటే. కానీ క్రీడల్ని నిర్వహించే అవకాశాన్ని మాత్రం డర్బన్ నిలబెట్టుకోలేకపోయింది. నాలుగేళ్లకోసారి వచ్చే కామన్వెల్త్ క్రీడల్ని వచ్చే ఏడాది క్వీన్స్లాండ్ (ఆస్ట్రేలియా)లో నిర్వహించనున్నారు. డర్బన్ రేసులోంచి తప్పుకోనున్న నేపథ్యంలో 2022 క్రీడల్ని నిర్వహించడానికి తాము సిద్ధమని లివర్పూల్ సిటీ (బ్రిటన్) పేర్కొంది. 2010లో భారత్ కామన్వెల్త్ క్రీడలను నిర్వహించిన సంగతి తెలిసిందే.