డబుల్ సాధించిన లక్ష్మణన్ గోవిందన్
మొత్తంగా 20 పతకాలతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. కజకిస్థాన్ (4 స్వర్ణ, 2 రజత, 2 కాంస్యం) 8 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. టోర్నీలో ఆఖరి రోజైన ఆదివారం లక్ష్మణన్ గోవిందన్.. 10 వేల మీటర్ల ఈవెంట్లోనూ పసిడి గెలిచి ‘డబుల్' సాధించాడు. అంతకముందు పురుషుల 5 వేల మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచాడు.
చివరి రోజు భారత్కు తొలి స్వర్ణం అందించిన స్వప్నా బర్మన్
చివరి రోజైన ఆదివారం జరిగిన మహిళల హెప్టాథ్లాన్లో స్వప్నా బర్మన్ భారత్కు తొలి స్వర్ణం అందించింది. ఇదే ఈవెంట్లో పూర్ణిమా హెంబ్రమ్ కాంస్యం సాధించింది. రెండు రోజుల పాటు మొత్తం ఏడు అంశాల్లో (100 మీటర్ల హర్డిల్స్, హై జంప్, షాట్పుట్, 200 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల పరు గు) జరిగిన ఈ ఈవెంట్లో 5942 పాయింట్లతో బర్మన్ అగ్రస్థానంలో నిలవగా.. పూర్ణిమ 5798 పాయింట్లతో మూడో స్థానం సాధించింది.
జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా
లక్ష్మణన్ గోవిందన్ 29:55.87 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఇదే పోటీలో గోపి తొనకాల్ (29:58.89 సె) రజతం గెలుచుకున్నాడు. జావెలిన్ త్రోలో యువ సంచలనం నీరజ్ చోప్రా పసిడి గెలిచాడు. అతను జావెలిన్ను 85.23 మీటర్ల దూరం విసిరి కొత్త మీట్ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు.
4×400 మీ పరుగులో పతకాలు సాధించిన పురుషులు
ఇదే పోటీలో దేవేందర్సింగ్ (83.29 మీ) కాంస్యం సాధించాడు. ఇక 4×400 మీ పరుగులో పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. కుంజు మహ్మద్, అమోజ్ జాకబ్, మహమ్మద్ అనాస్, రాజీవ్ అరోకియాతో కూడిన పురుషుల జట్టు 3 నిమిషాల 02.92 సెకన్ల టైమింగ్తో అగ్రస్థానం సాధించింది.
4×400 మీ పరుగులో పతకాలు సాధించిన మహిళలు
టోర్నీకి ఆఖరిదైన మహిళల రిలేను దెబాశ్రీ మజుందార్, ఎమ్.ఆర్. పూవమ్మ, జిస్నా మాథ్యూ, నిర్మలతో కూడిన భారత్ 3 నిమిషాల 31.34 సెకన్లలో ముగించి స్వర్ణం కైవసం చేసుకుంది. బెంగాల్కు చెందిన 20 ఏళ్ల స్వప్న చివరి రేసు ముగిశాక ట్రాక్పై సొమ్మసిల్లి పడిపోగా.. ఆమెకు వెంటనే వైద్య చికిత్స అందించారు.
అర్చనా అధావ్పై అనర్హత వేటు
మహిళల 800 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్ అర్చనా అధావ్పై అనర్హత వేటు పడకుంటే మన ఖాతాలో మరో పసిడి చేరేది. అర్చన.. రేసులో తమను కావాలనే అడ్డుకుందని శ్రీలంక అమ్మాయిలు ఫిర్యాదు చేయడంతో వీడియోను వీక్షించిన అధికారులు ఆమెను దోషిగా తేల్చారు. అర్చన నుంచి స్వర్ణం వెనక్కి తీసుకుని.. నిమిలి వళివర్ష (2:05.23 ని, శ్రీలంక), గయంతిక తుషారి (2:05.27 ని, శ్రీలంక)లకు స్వర్ణ, రజత పతకాలు ప్రకటించారు.
రెండో ల్యాప్లోనే వైదొలిగిన టింటు లుకా
అయితే డిఫెండింగ్ ఛాంపియన్ టింటు లుకా గాయం కారణంగా రెండో ల్యాప్లోనే వైదొలిగింది. ఒడిషా రాజధాని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో అథ్లెట్లు ఒకరివెనుక మరొకరు పతకాలు తెస్తుంటే ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.