|
మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా
మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. ప్రశాంత్ కుమార్ సూపర్ ట్యాకిల్ చేయడంతో యోధ 25-30తో మ్యాచ్లో ఉత్కంఠ పెంచింది. అయితే 39వ నిమిషంలో అబ్జోర్ సూపర్ ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ 31-26తో విజయానికి చేరువైంది. చివర్లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి మరో సూపర్ రైడ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
|
9 పాయింట్లు సాధించిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరి
తెలుగు టైటాన్స్ జట్టులో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (9 పాయింట్లు), నీలేశ్ సోలంకి (5 పాయింట్లు) చెలరేగారు. డిఫెన్స్లో అబోజర్ మిఘాని 6 టాక్లింగ్ పాయింట్లతో హైఫైవ్ సాధించాడు. ఇక, యూపీ యోధ తరఫున ప్రశాంత్ రాయ్ (11 పాయింట్లు) ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగినా జట్టును గెలిపించలేకపోయాడు.
|
డిఫెన్స్లో తెలుగు టైటాన్స్ మెరుగ్గా రాణించింది
రైడింగ్లో ఇరు జట్లూ సమవుజ్జీలుగా నిలిచినా.. డిఫెన్స్లో తెలుగు టైటాన్స్ మెరుగ్గా రాణించి ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. మరో మ్యాచ్లో యు ముంబా 53-26తో హరియాణా స్టీలర్స్పై గెలిచింది. యు ముంబా తరఫున అభిషేక్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించగా... హరియాణా తరఫున వికాస్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు.

మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్పై యు ముంబా విజయం
రైడింగ్, డిఫెన్స్లోనూ ముంబా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అభిషేక్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించగా.. డిఫెన్స్లో ఫజల్ అత్రాచెలి 7 టాక్లింగ్ పాయింట్లతో అదరగొట్టాడు. ప్రో కబడ్డీలో ఆదివారం నాడు పట్నా పైరేట్స్తో యూపీ యోధా, హరియాణా స్టీలర్స్తో పుణేరి పల్టన్ జట్లు తలపడనున్నాయి